Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Andhra Pradesh Assembly: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ‘ ప్రమాణం ‘

–ముగిసిన 172 మంది ప్రమాణ స్వీకారం
–తొలిసారి గా అసెంబ్లీలో అడు గుడిన పవన్‌ కల్యాణ్‌
–సీఎం హోదాలో అసెంబ్లీకొచ్చి ప్రతి న నెరవేర్చుకున్న చంద్రబాబు

Andhra Pradesh Assembly: ప్రజా దీవెన,అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh Assembly) ప్రమాణ స్వీకారం ఆసక్తికరంగా కొనసాగింది. ఆంధ్ర ప్రదేశ్‌ 16వ శాసనసభ కోలాహలం గా కొలువు దీరింది. కొత్త శాసనసభ (Legislature)మొట్టమొదటి సమావేశాలు శుక్ర వారం ప్రారంభమయ్యాయి. కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయిం చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu), ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Deputy Chief Minister Pawan Kalyan), మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి (Former CM Jaganmohan Reddy) సహా మొత్తం 172 మంది శాసనసభ్యు లుగా ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన, బీజేపీ, వైసీపీ సభ్యులు అందరూ ప్రమాణం చేశారు. టీడీ పీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాలతో మొదటిరోజు సభకు హాజరు కాలేకపోగా శనివారం ప్రమాణం చేస్తారు. కాగా ప్రభు త్వం నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం ఉదయం 9.26 గంటలకు సభ ప్రారంభమైంది.

తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పవన్‌ (pawan), లోకేశ్‌ (lokesh)సభలోకి వస్తుండగా కూటమి ఎమ్మెల్యేలంతా కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. సభలోకి రాగా నే వారిద్దరూ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. ఇదిలా ఉండగా సీఎంగానే సభలోకి అడుగు పెడ తానని రెండున్నరేళ్ల క్రితం ప్రతిన బూనిన చంద్రబాబు (chandra babu)అనుకున్నట్లు గానే నెరవేర్చుకున్నారు. ముఖ్య మంత్రి హోదాలోనే సభలోకి అడు గు పెట్టగా అసెంబ్లీ ప్రధాన ద్వారం ముందు మెట్ల వద్ద నడుం వంచి నమస్కరించి, పూలు చల్లి లోపల అడుగు పెట్టారు. కరతాళ ధ్వను లతో కూటమి ఎమ్మెల్యేలంతా ఆయనను ఘనంగా స్వాగతిం చారు. ప్రజాస్వామ్యం గెలిచింది, గౌరవ సభలోకి స్వాగతం బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ నినాదాలతో దద్దరిల్లింది. బాబు సభలోకి రాగానే పవన్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడంతో సభ మరోసారి చప్పట్లతో మార్మోగింది.

జాతీయ గీతాలాపనతో ప్రొటెం స్పీకర్‌ సభను ప్రారంభించారు. 9.51 గంటలకు మొదట చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఉపముఖ్యమంత్రి పవన్‌ (pawan) ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంత రం లోకేశ్‌ తన తండ్రి చంద్రబాబు కు పాదాభివందనం చేశారు. మం త్రులు ప్రమాణం చేసిన తర్వాత ఆలస్యంగా సభలోకి వచ్చిన జగన్‌ తమ ఎమ్మెల్యేల పక్కన కూర్చున్నా రు. కూటమి ఎమ్మెల్యేల్లో బీజేపీకి చెందిన విష్ణుకుమార్‌రాజు ఒక్కరే ఆయన వద్దకు వెళ్లి పలుకరించా రు. మహిళా సభ్యుల తర్వాత జగన్‌ ప్రమాణం చేశారు. అనం తరం బయటకు వెళ్లిపోయారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) కూడా ప్రమాణం చేసిన తర్వాత వెళ్లిపోయారు. మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు సభలోనే ఉన్నా రు. అయితే ఉదయం సభలో అడు గుపెట్టినప్పటి నుంచి సభ వాయిదా పడేవరకు పవన్‌ సభలోనే గడిపా రు. సభ నిర్వహణ, కార్యకలాపాల ను ఆసాంతం పరిశీలించారు. ప్ర మాణస్వీకారం చేసిన ప్రతి ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం అనంతరం ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేయడంతో ఆయన కూడా వారం దరికీ అభినందనలు తెలిపారు. ప్రొటెం స్పీకర్‌ సభను వాయిదా వేసిన తర్వాత ఎమ్మెల్యేలంతా ఆయన వద్దకు చేరారు. చాలా మంది సభలోనే ఆయనతో సెల్ఫీ లు, ఫొటోలు దిగారు. పవన్‌ (pawan) కూడా ఓపిగ్గా అందరితో మాట్లాడుతూ ఫొటోలు దిగారు.