BUS FIRE ACCIDENT : ప్రజా దీవెన, కందుకూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందు కూరులో అర్ధరాత్రి వేళ ఆర్టీసీ బ స్సు కాలిబూడిదైంది. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండ లం మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద హై వేపై శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ బ స్సు అగ్ని ప్రమాదానికి గురైంది.
19 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి తిరువూరు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సులో ఒక్కసారిగా మంట లు చెలరేగాయని స్థానికులు తెలి పారు. డ్రైవర్ వెంటనే అప్రమత్తం అవ్వడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
APSRTC bus fire accident pic.twitter.com/pDdIgt2Lt6
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) January 18, 2025