Chandrababu naidu birthday: తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో చంద్రబాబు కృషి మరవలేనిది
తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74 వ జన్మదిన వేడుకలను నల్గొండ అసెంబ్లీ ఇంచార్జి యల్ వి యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
టిడిపి నల్లగొండ నియోజక వర్గ ఇన్చార్జ్ ఎల్వి. యాదవ్
ఘనంగా చంద్రబాబు 74 వ పుట్టినరోజు వేడుకలు
ప్రజా దీవెన నల్గొండ:తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( Nara chandrababu naidu birthday celebrations)74 వ జన్మదిన వేడుకలను నల్గొండ అసెంబ్లీ ఇంచార్జి యల్ వి యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎల్.వి.యాదవ్ మాట్లాడుతూ తెలుగు ప్రజల తలసరి ఆదాయం పెరగడానికి, వారి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేసిన కృషి మరువలేనిదన్నారు.
నాడు గ్రామాలను పట్టణ స్థాయిలో అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేశాడన్నారు. హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా నిరుద్యోగులకు దేశ, విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మహిళల అభివృద్ధికి గ్యాస్ సిలిండర్లు, సమభావన సంఘాల ఏర్పాటు, రాష్ట్ర అభివృద్ధికి జన్మభూమి, శ్రమదానం, క్లీన్ అండ్ గ్రీన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి చంద్రబాబు పాటుబడ్డాడని అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్(AP) ప్రజానీకం చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తేనే వారికి భవిష్యత్ బాగుంటుంది అని భావిస్తూ జరగ బోయే ఎన్నికలలో తెలుగు దేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
రెండు రాష్టాల తెలుగు(telugu states) ప్రజల అభిమానం తో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని తెలుగు ప్రాంతాల అభివృద్ధికి తన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, పార్లమెంట్ అధికార ప్రతినిధి కూరెళ్ల విజయ్ కుమార్, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎం కే ఐ సిద్ధిక్, పట్టణ ప్రధాన కార్యదర్శి గోగుల నాగరాజు, నాయకులు తేలు రవి, జంపాల చంద్రశేఖర్, మహేశ్వరం గోపాల్, కంచనపల్లి క్రాంతికుమార్, గంగాధర్ స్వరాజ్, భూతం వెంకటయ్య, బొంత రమేష్, దాడి మధుసూదన్ రెడ్డి,తిరుపతయ్య, లయన్స్ క్లబ్ లీడర్స్ మందడి నర్సిరెడ్డి, చిలుకూరి రామకృష్ణ, గట్టుపల్లి అశోక్ రెడ్డి, సత్యనారాయణ, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Chandrababu naidu devolped telugu states