Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM CHANDRA BABU: పాత ప్రభుత్వ హ్యాoగోవర్ విధానాన్ని విడనాడండి

CM CHANDRA BABU

–ఏపి పోలీసులకు సీఎం చంద్రబాబు హితవు

CM CHANDRA BABU: ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా (ANDHRA PRADESH CM)బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సారిగా చంద్రబాబు (CHANDRA BABU) టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేశారు. సీఎం చంద్రబాబుని కలిసేందుకు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి టీడీ పీ శ్రేణులు, కార్యకర్తలు తరలివ చ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పోలీసులు ఐర‌న్ గ్రిల్స్ తో బార్కేడింగ్ ఏర్పాటు చేయ గా ముఖ్యమంత్రి చంద్రబాబు (CHANDRA BABU) ఆగ్ర హం వ్యక్తం చేశారు.బార్కేడింగ్ చూసి పాత ప్రభుత్వ విధాన హ్యాo గోవర్ వీడాలంటూ పోలీసులతో సుతిమెత్తగా మందలించారు.

పార్టీ శ్రేణులకు, తనకు అడ్డుగోడలు తెచ్చే చర్యలు ఉపేక్షించనని చంద్ర బాబు (CHANDRA BABU) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ మీ భద్రతా సాయంతోనే పార్టీ కార్యాలయం నడపలేదనే విష యాన్ని గుర్తించాలని ఆయన అన్నారు.తనకు, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడ‌లు ఉండటానికి వీల్లేద‌ని సీఎం చంద్రబాబు (CHANDRA BABU) అన్నా రు. ప్రజల నుంచి వారి సమస్యలపై వినతులు స్వీకరించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామ‌ని అన్నారు. ఎన్టీఆ ర్ భవన్ (NTR) కు విచ్చేసిన చంద్రబాబు అక్కడ వివిధ వర్గాల ప్రజలను కలు సుకుని వారి సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా కడప రాజారెడ్డి వీధికి చెందిన దివ్యాంగుడు కనపర్తి మనోజ్ కుమార్ కు రూ.3 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. వైద్యం కోసం సాయం చేయాలని మనోజ్ కుమార్ సీఎం చంద్రబాబును అర్థిం చాడు. ఆ దివ్యాంగుడి పరిస్థితి పట్ల స్పందించిన సీఎం చంద్ర బాబు వెంటనే ఆర్థికసాయం ప్రకటించారు.