Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

పది రోజుల్లో పెళ్ళి… పటాపంచలైన ఆనందం

పట్టు మని పది రోజుల్లో పెళ్లితో ఆ కు టుంబం లో ఆనందం వెల్లివిరిసిం ది. ఆ ఆనందం ఆ క్షణంలోనే ఊహకందకుండా పటాపంచలైంది.

పెళ్లి బట్టలు షాపింగ్ కు వెళ్లి వస్తూ అనంతలోకాలకు
అనంతపురం 44వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
అకస్మాత్తుగా డివైడర్‌ను ఢీకొట్టి లారీ కిందకు వెళ్లిన కారు

ప్రజా దీవెన, అనంతపురం: పట్టు మని పది రోజుల్లో పెళ్లితో (Marriage)ఆ కు టుంబం లో ఆనందం వెల్లివిరిసిం ది. ఆ ఆనందం ఆ క్షణంలోనే ఊహకందకుండా పటాపంచలైంది. పెళ్లి కొడుకు సహా కుటుంబ సభ్యు లు రెండు కార్లలో హైదరాబాద్‌కు వెళ్లి పెళ్లి దుస్తులు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమైన సందర్భంలో స్వస్థలానికి మరో గంటలో చేరుకో వాల్సి ఉండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు వేగంగా డివైడరును ఢీకొని, అవతలి వైపు వస్తున్న లారీ కిందకు దూసుకుపో యింది. ఈ ప్రమాదంలో పెళ్లికొడు కు సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

అనంత పురం(Anantapuram ) జిల్లా గుత్తి(Gutti) మండలం బాచు పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. పెళ్లికొడుకు షేక్‌ ఫిరోజ్‌ బాషా(30), ఆయన తండ్రి అలీసాహెబ్‌ (56), సోదరుడి భార్య జహీరా బాను (40), సోదరుడి పిల్లలు మహమ్మద్‌ ఆయాన్‌ (6), మహమ్మద్‌ ఆమాన్‌ (3), పిన్ని రెహనా బేగం (40) మృతిచెందారు. ఫిరోజ్‌ పిన్ని కొడుకు మహమ్మద్‌ గౌస్‌ తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం నగరంలోని బిందెల కాలనీకి చెందిన షేక్‌ ఫిరోజ్‌ బాషా ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉద్యోగి. ఈ నెల 27న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి దుస్తులు కొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులంతా రెండు కార్లలో హైదరాబాద్‌(Hyderabad) వెళ్లారు.

రాత్రి వరకూ షాపింగ్‌ చేసి తిరుగు ప్రయాణమ య్యారు. ఫిరోజ్‌ బాషా, తండ్రి అలీసాహెబ్‌, పిన్నమ్మ రెహనా బేగం, సోదరుడి పిల్లలు మహమ్మద్‌ ఆయాన్‌, మహమ్మద్‌ ఆమాన్‌, వదిన జహీరా బాను, పిన్నమ్మ కొడుకు మహమ్మద్‌ గౌస్‌ ఒక కారులో ఎక్కారు. మరో కారులో ఫిరోజ్‌ బాషా తల్లి, ఆమె కూతురు, అల్లుడు, మరో ఇద్దరు బయలుదే రారు. వీరు గంట ముందుగానే అనంతపురానికి చేరుకున్నారు. ఫిరోజ్‌, ఇతర కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు తెల్లవారుజా మున గుత్తి మండలం బాచుపల్లి వద్దకు రాగానే డ్రైవింగ్‌ చేస్తున్న మహమ్మద్‌ గౌస్‌ నిద్రమత్తు వల్ల అదుపు తప్పింది.

డివైడరును ఢీకొని, అవతలి వైపున లారీ కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జ య్యింది. లారీ మడ్‌గార్డ్‌ రేకు చొచ్చుకెళ్లడంతో ఫిరోజ్‌ తల మొం డెం నుంచి వేరైంది. ప్రమాద స్థలం లోనే ఆయనతో సహా నలుగురు మృతిచెందారు. గాయపడ్డ ముగ్గురి లో ఒకరు గుత్తి ప్రభుత్వ ఆస్ప త్రిలో, మరొకరు అనంతపురం ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మృతిచెందారు. డ్రైవింగ్‌ చేసిన మహమ్మద్‌ గౌస్‌ అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. ఫిరోజ్‌ తండ్రి అలీసాహె బ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్దకొడుకు రెండేళ్ల క్రితం మృతిచెందాడు. ఇప్పుడు ప్రమా దంలో అలీసాహెబ్‌తో పాటు మిగిలిన ఒక్క కొడుకు, వితంతు వైన పెద్ద కోడలు, ఆమె ఇద్దరు కుమారులు చనిపోయారు.

Gutti Mandal of Anantapuram District