AB Venkateswar rao: ఐదేళ్ల తర్వాత బాధ్యతలు అదే రోజు పదవి విరమణ
ఆంద్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్లోకి తీసుకున్న ప్రభుత్వం
ఉద్యోగ విరమణ దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు
విజయవాడలో బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు
ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేనని వ్యాఖ్య
ప్రజా దీవెన, అమరావతి: ఆంద్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని(AB Venkateswar rao) సర్వీస్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్గా ఏబీవీకి పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్వీసులోకి తీసుకునేందుకు వీలుగా ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి జవహర్రెడ్డి(Jawahar Reddy)ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభు త్వం విధించిన సస్పెన్షన్ను ఇటీవ ల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఎత్తివేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉద్యోగ విరమణ చేయనున్న దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఆ మేరకు వెంకటే శ్వరరావుకు పోస్టింగ్ ఇస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఆయన విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన రోజే విరమణ చేయా ల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వ రరావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేనని, ప్రస్తుతానికి ఇంత వరకే మాట్లాడగలనని అన్నారు. ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానని ఏబీవీ తెలిపారు. రెండుసార్లు ఏబీ వెంకటేశ్వర రావును సస్పెండ్… రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల తో వైఎస్సార్సీపీ(YSRCP) ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిం ది.
డైరెక్టర్ జనరల్ ర్యాంక్ కలిగిన ఆయనకు ఐదేళ్లుగా పోస్టింగ్ ఇవ్వ కుండా సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు(Suspensions)విధించింది. అక్రమ కేసులతో జగన్ ప్రభుత్వం, వైఎస్సార్సీపీ వీరభక్త అధికారగణం వేధింపులకు గురి చేసింది. ఆ తర్వాత ఏబీవీ క్యాట్ ను ఆశ్రయించగా సస్పెన్షన్ను సమ ర్థించింది. అనంతరం ఆయన హైకో ర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం సుప్రీంకోర్టుకు(Supreme Court)వెళ్లింది. సర్వీ సులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్లో ఉంచొ ద్దని ఆదేశిస్తూ ఏబీ వెంకటేశ్వరరా వుపై ఉన్న సస్పెన్షన్ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చింది.
ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏ కారణంతో సస్పెండ్ చేశారో తిరిగి అదే కారణం తో మరోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొద్ది రోజుల క్రితం ఏబీవీపై(ABV) ప్రభుత్వం రెండోసారి విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తూ కేంద్ర పరిపా లన ట్రైబ్యునల్ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే క్యాట్ ఆదే శాలపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయిం చింది. విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం క్యాట్ ఉత్త ర్వులపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఏబీవీ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారనే విష యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన హై కోర్టు ప్రభుత్వం ఐదేళ్లుగా ఆయన్ని సస్పెన్షన్లోనే ఉంచిన విషయాన్ని గుర్తు చేసింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను ఈ దశ లో నిలిపిస్తే అది ఏబీ వెంకటేశ్వ రరావుకి తీవ్ర నష్టం కలగజేస్తుందని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది.
సుదీ ర్ఘమైన సర్వీసు కలిగి ఎన్నో కీలక మైన పదవులు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావుకి సంబంధించి క్యాట్ ఉత్తర్వుల్ని అమలు చేయ కుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని అభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశాలతో ఏబీవీకి పోస్టిం గ్ ఇచ్చేందుకు వీలుగా ఆయనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. చివరకు క్యాట్ అదేశాలిచ్చినా ప్రభుత్వం సహరి స్తుందా లేదా అన్న అనుమానాల మధ్య ఎట్టకేలకు పదవి విరమణ రోజే ఏపి ప్రభుత్వం ఏబి వెంకటే శ్వర రావు ను జాయిన్ చేసుకో వడంతో వివాదం కాస్తా సద్దుమ ణిగింది. మొత్తానికి వెంకటే శ్వరరా వు బాధ్యతలు చేపట్టి ఈ రోజే పదవీ విరమణ చేస్తున్నందున ఎబీ వేంకటేశ్వర రావు, ఏపి(AP) ప్రభుత్వం మధ్య వివాదం సుఖాంతమైందని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
IPS officer AB venkateswar rao resigned