–మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే లతో కలిసి మంత్రి జూపల్లిపర్యటన
–పర్యాటక ప్రాంతాల అభివృద్ది కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన
–రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు స్టడీటూర్
Minister Jupalli Krishna Rao: ప్రజా దీవెన, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధి లోని నల్లమల అటవీ ప్రాంతంలో (Nallamala forest area) పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్దం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt). పర్యాటక ప్రదేశాల్లో సౌక ర్యాల కల్పన, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలపై కసరత్తు ను ప్రారంభిస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందు కు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిం చింది. ఎకో, టెంపుల్, రివర్ టూరి జం (Eco, temple, river tourism) సముహాల అభివృద్ధి, వసతుల కల్పనపై కసరత్తుకు శ్రీకారం చుడు తోంది. నల్లమలను పర్యాటక హాబ్ గా తీర్చిదిద్దడంలో భాగంగా పర్యా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) నేతృత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల బృందం జూలై 5, 6వ తేదీల్లో నల్ల మలలో పర్యటించనుంది. రెండు రోజుల స్టడీ టూర్ లో భాగంగా ప ర్యాటక అభివృద్ధి, మౌలిక వసతు లు కల్పన, స్థానిక యువతకు ఉపా ధి అవకాశాలు కల్పన తదితర అం శాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారు.
పర్యటన వివరాలు ఇలా.. మన్ననూర్ (Mannoor)లోని ఈఈసి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ సెంటర్, బయో ల్యాబ్, వ్యూ పాయింట్, కదలై వనం సంద ర్శన, బెహ్రపూర్ ఆలయ దర్శనం, మల్లెల తీర్థం జలపాతం, వజ్రాల మడుగు, అక్టోపస్ వ్యూ పాయింట్ సందర్శన, జూలై 6న అక్కమాంబ బిల్లం, రివర్ బోటింగ్, మద్దిమడు గు ఆంజనేయస్వామి దర్శనం, గీ సు గండీ రివర్ పాయింట్, గున్నం పేట, రాయలగండి,అంతర్ గంగా సందర్శన, మన్ననూర్ జంగిల్ రిసా ర్ట్, ప్రతాపరుద్రుని కోటను సందర్శిం చనున్నారు.