NDA meeting Babu, Kalyan Delhi : డిల్లీకి చంద్రబాబు, పవన్
--ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఇరువురి పయనo --ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉత్సాహానికి మోదీకి ఆహ్వానం
డిల్లీకి చంద్రబాబు, పవన్
–ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఇరువురి పయనo
–ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉత్సాహానికి మోదీకి ఆహ్వానం
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ( ch andhrababu), జన సేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్కల్యాణ్ (pawan kalyaan) బుధవారం డిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఎన్డీ యే సమావేశంలో పాల్గొనేందుకు ఏపి కూటమి నేతలైన బాబు, పవ న్లు ఢిల్లీకి పయనమయ్యారు. వారిద్దరూ వేర్వేరుగా ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
ఎన్డీయే (nda) భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొని కేంద్రం లో ప్రభు త్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో జరిగే చర్చలో భాగస్వా ములవు తారు. ఏపీ ప్రభుత్వంలో తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ఢిల్లీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఢిల్లీ బయ ల్దేరే ముందు ఎన్డీయేలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. మరో వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా విమా నంలో ఢిల్లీ బయల్దేరారు.
ఎన్డీయే సమావేశంలో చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొననున్నా రు. అంతకు ముందు జనసేన నుంచి గెలుపొందిన ఎంపీలు, ఎమ్మె ల్యేలతో పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశమై వారందరికీ అభి నందనలు తెలిపారు. మరింత బాధ్యతతో కలిసి పని చేయాలని సూచించారు. ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల న్నారు. మద్దతుపై లాంఛనంగా తీర్మానం చేయనున్నారు.
అయితే ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్ర మాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనికి బీజేపీ (bjp) పెద్దలను ఆహ్వా నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఫలితాలు వెల్లడైన తర్వాత మంగళవారం రోజున చంద్రబాబుతో పవన్ కల్యా ణ్ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు గంటకుపైగా చర్చలు సా గాయి. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకా రంపై చర్చించినట్లు సమా చారం.
ఎన్డీయే సమావేశానికి హాజరయ్యే అంశంపైనా నేతలు మాట్లాడుకు న్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పిఠాపురం ( pitapuram) ప్రజలం దరికీ పవన్ కల్యా ణ్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. కదం తొక్కిన జనసైనికు లకు పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. ప్రజలు ఆకాశమంత విజ యం ఇచ్చారని, దాన్ని గుండెల్లో పెట్టు కుంటామ ని అన్నారు. గెలుపు తనకు బాధ్యతనిచ్చిందని, అహంకారాన్ని కాద ని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
*దేశ రాజకీయాల్లోనే లెజెండరీ లీడర్ చంద్రబాబు..* సార్వత్రిక సమరంలో బీజేపీ గెలిచినప్పటికీ మెజారిటీ గతం కంటే కొద్దిగా తగ్గిం ది. పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన బీజేపీ సింగిల్గా ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసే శక్తి లేకుండా పోయింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమిలోని పార్టీలపై బీజేపీ ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్నారు.
ఎన్డీయే కూటమిలో గతంలో మాదిరే బాబు కీలకంగా మారే అవ కా శం ఉంది. దేశంలో అటు ఎన్డీయే ఇటు ఇండియా బ్లాక్గా రాజకీయ పార్టీలు అన్ని విడిపోయాయి. రెండు భారీ క్యాం పుల మధ్య హోరా హోరీ పోరు సాగింది. ఎన్డీయేలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిం చింది. బీజేపీ తర్వాత తెలుగుదేశం మినహా మరే పార్టీకి అన్ని సీట్ల లో విజయం సాధించలేవు.
ఏపీలో ఎన్డీయే 21 స్థానాల్లో గెలుపొందగా తెలుగుదేశం పార్టీ సింగి ల్గా 16 సీట్లు సాధించుకుంది. ఈ బిగ్ నంబర్తో ఎన్డీయే లో మోడీ ( modi) తర్వాత చంద్రబాబు కీలకం అయ్యారు. బీజేపీ సింగిల్గా ప్రభు త్వా న్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో జాతీయ రాజ కీయాల్లో చక్రం తిప్ప డానికి సరిపడా అన్ని అవకాశాలు బాబుకు ఉన్నాయి.
ఎన్డీయే కూటమికి టైట్ మార్జిన్ రావడంతో బాబు పాత్ర అత్యంత కీలకం అయింది.ఇండియా కూటమిలోని మిత్రులను ఈ వైపునకు తీసుకుని వచ్చినా ఆశ్చర్యపో నవ సరం లేదు. తద్వారా రాష్ట్రానికి కావాల్సిన నిధుల ను కేంద్రం నుంచి తీసుకురాగల సమర్థుడేనన్న చర్చో పచర్చలు కొన సాగుతున్నాయి.