Sharmila: ఉపాధి హామీ కూలీలతో షర్మిల ముఖాముఖి
యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో ఏపిసిసి చీఫ్, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ముఖాముఖి అయ్యా రు.
ఉపాధి హామీ కూలీల కష్టాలు అడిగి తెలుసుకున్న ఏపిసిసి చీఫ్ షర్మిలా
ప్రజా దీవెన, కడప: యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో ఏపిసిసి చీఫ్, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ముఖాముఖి అయ్యా రు. ఈ సంధర్బంగా ఉపాధి హామీ కూలీల కష్టాలు అడిగి తెలుసు కున్నారు. ఉపాధి హామీ కింద ఎటువంటి వసతుల కల్పన లేదని, రోజంతా కష్టపడ్డా రూ. 200 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని కూలీలు ఆమె దృష్టి కి తీసుకవచ్చారు. కూలీలకు భరోసా నింపేందుకు గాను అమె పలుగు,పార పట్టి మట్టి తవ్వారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లడుతూ ఉపాధి హామీ పథ కాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నీరు గార్చాయని ఆరోపించారు. పొద్దం తా పని చేస్తే ఇచ్చే వేతనం రూ. 20 0 కన్నా మించడం లేదని, వృద్దుల కు రూ. 150 కన్నా ఎక్కువ ఇవ్వ డం లేదని అవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖ ర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం పండుగలా సాగిందని గుర్తు చేశారు. కూలీలకు పని తో పాటు వసతుల కల్పన కూ డా ఉండేదని,ఇప్పుడు కనీసం మం చి నీరు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారం లో వచ్చిన వెంటనే ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం రూ. 400 లకు పెంచుతామని, జగన్ బటన్ నొక్కుతున్నా అని చెప్పి ఉన్నది గుంజుకున్నాడని ఆరోపించారు. ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి మరో చేత్తో వెండి చెంబు తీసుకున్నాడని ద్వజమెత్తారు.
Sharmila meets with labour in kadapa