vote registration: ఓటు నమోదుకు గడువు మూడురోజులే
భారత్ లో ఓటు నమోదుకు గడువు ఇంకా మూడు రోజులే మిగిలింది. ఓటు నమోదు చేసుకోని వారు త్వరగా స్పందించి ఓటరుగా నమోదు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరుతోంది.
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భారత్ లో ఓటు నమోదుకు గడువు ఇంకా మూడు రోజులే మిగిలింది. ఓటు నమోదు చేసుకోని వారు త్వరగా స్పందించి ఓటరుగా నమోదు (vote registration) చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పుడు దరఖాస్తు చేసుకొని ఓటు హక్కు పొందిన వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయవచ్చని అధికారులు అంటున్నారు. అయి తే కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 15తో ముగియనుంది. 2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసు కునేందుకు అర్హు లు. ఇప్పటికే 18ఏళ్లు నిండినా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఫోన్లోనూ కూడా voters.eci.gov.in సైట్ లో దర ఖాస్తు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యం రక్షణ, అవినీతి వ్యతిరేక ప్రభుత్వా ల కోసం యువతరం కదిలి తక్షణ మే ఓటునమోదు చేసుకోండి.
vote registration deadline three days