Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : బిగ్ బ్రేకింగ్, రోడ్డు ప్రమాదంలో ఐపీ ఎస్ అధికారి దుర్మరణం

Big Breaking : ప్రజా దీవెన, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో శనివారం మధ్యా హ్నం చోటు చేసుకున్న రో డ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెం దిన ఐపీఎస్ అధికారి దుర్మరణం పాలయ్యారు. అమ్రాబాద్ మండ లం శ్రీశైలం హైవేలో పగవర పల్లి‍దో మల పెంట మధ్యలో ఎదురుగా వ స్తున్న బస్సును కారు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా అందులో సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్న ట్లు గుర్తించారు. వీరంతా కారులో మహారాష్ట్ర నుంచి బయల్దేరి శ్రీశై లం వెళుతున్నట్లుగా సమాచారం.

ఈ ప్ర మాదంలో గాయపడిన మ రొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ఈగల పెంట ఎస్ఐ వీరమల్లు తెలిపిన స మాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కొం దరు శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఇన్నోవా కారులో వెళ్తున్న క్రమంలో సరిగ్గా దోమల పెంట గ్రామ సమీ పంలోకి రాగానే శ్రీశైలం వైపు నుంచి హైదరాబాద్ వెళుతున్న పీకేట్‌ డి పోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఇన్నో వా కారు ఎదురెదురుగా ఢీ కొనడం తో ఇన్నోవా కారు లో ఉన్న ఇద్దరికీ బలమైన గాయాలు అయ్యాయి.

వెంటనే క్షతగాత్రులను ఒక ప్రైవే టు అంబులెన్స్ తో పాటు ఈగల పెంట ఎస్సై పోలీసు వాహనంలో అచ్చం పేట ప్రభుత్వ ఏరియా ఆసు పత్రికి తరలించారు. క్షత గాత్రులలో ఒకరు డాక్టర్ సుధాకర్ పటేల్ ఐపీఎస్ మహారాష్ట్ర, రాజేం ద్రనగర్ పోలీస్ అకాడమీలో విధు లు నిర్వహిస్తున్నారని, తెలి సింది. ఈయనకు తల పై బలమైన గా యాలు అయినట్లు సమాచారం.

మరొక వ్యక్తి భగవత్ కృష్ణారావు రెండు కాళ్లకు బలమైన గాయాలు అయ్యాయని సమాచారం. అచ్చం పేట ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ప్రధాన రహదారి వెల్దండ సమీపంలో ఉన్న ఎన్నం ప్రైవేట్ ఆసుపత్రికి తరలిం చగా చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.