Road Incidents: వేర్వేరు ప్రమాదాల్లో హెడ్ కానిస్టేబుల్, యువకుడు దుర్మరణం
తెలంగాణలో రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ గౌడ్ అనే హెడ్ కానిస్టేబుల్
రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ మృతి
ప్రజా దీవెన, సిరిసిల్ల: తెలంగాణలో రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ గౌడ్ అనే హెడ్ కానిస్టేబుల్(Head constable) దుర్మరణం చెందడంతో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. కొద్ది రోజుల పాటు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్లో (Yellareddypet Police Station) హెడ్ కాని స్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న 1995 బ్యాచ్కు చెందిన శ్రీనివాస్ గౌడ్ శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా తాడ్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గతంలో గంభీ రావుపేట పోలీస్ స్టేషన్లో సైతం హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించి సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేన్కు బదిలీపై వెళ్లారు. శ్రీనివాస్ గౌడ్ సొంత గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ కాగా గతం లోనే వారి కుటుంబం కామారెడ్డి లో స్థిరపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మృతి పట్ల ఎల్లారెడ్డి పేట రూరల్ సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎల్లారెడ్డి పేట ఎస్.ఐ రమాకాంత్ గంభీరావుపేట ఎస్ఐ రామ్మోహన్, కోనరా వుపేట ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో విషా దం చోటు చేసుకుంది. జిల్లాలోని ఏజెన్సీ మండలమైన కరకగూడెం( Karakagudem mandal) మండలంలోని కలవాలా నాగారం గ్రామం దాటుతుండగా మూల సమీ పంలో అదుపుతప్పి పక్కనున్న చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందాడు మరొకరు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం చోటుచే సుకుంది.
మణుగూరు మండలం విజయనగరం గ్రామానికి చెందిన బిజ్జా రమేష్ , సోదరుడు కృష్ణ ఇద్దరు సొంత అన్నదమ్ములు, వారు విజయనగరం నుండి కరకగూడెం వెళ్తుండగా కలవల నాగారం సమీపంలో మూలములకు అదుపు తప్పడంతో తమ్ముడు బిజ్జా రమేష్ రమేష్ మృతి చెందాడు. అన్నయ్య బిజ్జా కృష్ణ గాయాలతో ఉండగా స్థానిక గ్రామస్తులు సమాచారం మేరకు 108 మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమా చారం మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
rajanna sircilla yellareddypet Police