— షెడ్యూల్డ్ కులాల సహకార అభి వృద్ధి సంస్థ చైర్మన్ ఎన్ ప్రీతం
Telangana Global Recognition : ప్రజా దీవెన, వనపర్తి ప్రతినిధి: ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్క రించడంలో విజయం సాధించామ ని, అమెరికా, దక్షిణ కొరియా, సింగ పూర్, దావోస్, జపాన్ దేశాల్లో ప ర్యటించి భారీగా ప్రభుత్వం పెట్ట బ డులను సాధించిందన్నారు. హైద రాబాద్ వేదికగా ఏఐ గ్లోబల్ స మ్మి ట్, బయో ఏషియా సదస్సు, ప్ర పం చ సుందరీమణుల పోటీలను విజ యవంతంగా నిర్వహించామని రా ష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభి వృద్ధి సంస్థ చైర్మన్ ఎన్ ప్రీతం అ న్నారు. పేద, బడుగు, బలహీన వ ర్గాల సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశా నికి దిశానిర్దేశం చేస్తుందని తెలిపా రు. సోమ వారం జిల్లా ఐడిఓసి ప్రాం గణంలో తెలంగాణ రాష్ట్ర అవతర ణ దినో త్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. వేడుకలకు ము ఖ్య అతిథిగా రాష్ట్ర షెడ్యూల్డ్ కులా ల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రీతం హాజరయ్యారు. ఆయనతో పాటు వేదికపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, వన పర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి.వెంక టేశ్వర్లు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, వనపర్తి మా ర్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ హాజర య్యారు. ముందుగా కలెక్టర్, శాసన సభ్యులతో కలిసి తెలంగాణ అమ రవీరుల స్థూపానికి పుష్పగుచ్చంతో నివాళి అర్పించారు.
అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా యం త్రాంగం తరుపున ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలను తెలిపా రు. అనంతరం జయ జయహే తెలంగాణ గీతాలాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల సం క్షేమంతో పాటు సామాజిక న్యా యంలో సైతం తెలంగాణ దేశానికి దిశా నిర్దేశం చేస్తుందని తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 ఏళ్ళు నిండాయని తెలిపారు. రా ష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి ది శగా పయనిస్తోందన్నారు.ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం, గృహాలకు ఉచితంగా విద్యుత్తును అందించే గృహజ్యోతి కల్పించినట్లు తెలిపా రు. భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి రాష్ట్రంలో భూసమస్య లను గుర్తించి సత్వర పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు.
ఈసందర్భంగా ముఖ్య అతిథి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయో ధులకు, తెలంగాణ స్వరాష్ట్ర సాధ న కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులను సత్కరించి గౌరవించా రు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ కా ర్యాలయంలో నిర్వహించిన వేడుక ల్లో ఆయా పాఠశాలలకు చెందిన చి న్నారులు సాంస్కృతిక నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈసం దర్భంగా ఐడిఓసి ఆవరణలో పోలీ స్ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణా భివృ ద్ధి శాఖ, జిల్లా వైద్యశాఖ, జిల్లా వ్య వసాయ శాఖ, పురపాలక, గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన స్టాళ్లను రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్ ప్రీతం, కలెక్టర్, ఎమ్మెల్యే సందర్శించి తిలకించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధు లు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఇతరులు పాల్గొన్నా రు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ సీత రాములు, జిల్లా వైద్య రోగ్య శాఖ అధికారి శ్రీనివాసులు, నాయ కులు రాజేంద్ర ప్రసాద్, శంకర్ నా యక్, చీర్ల జనార్దన్, కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.