Konda Surekha: దేశ పురోగమనానికి పునాది వేసింది కాంగ్రెస్
భారత దేశం పురోగమన పథంలో సాగడా నికి కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులే కారణమని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మం త్రి కొండా సురేఖ అన్నారు.
ఎన్నికల్లో సిపిఎం పార్టీకి మద్దతు ప్రకటించడం శుభపరిణామo
బిఆర్ఎస్, బిజెపి అభ్యర్ధులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు
కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సంగారెడ్డి సిపిఎం విస్తృ తస్థాయి సమావేశంలో మంత్రి కొండా సురేఖ
ప్రజా దీవెన, సంగారెడ్డి: భారత దేశం పురోగమన పథంలో సాగడా నికి కాంగ్రెస్ (congress)పార్టీ వేసిన పునాదులే కారణమని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మం త్రి కొండా సురేఖ(konda surekha) అన్నారు. మెదక్ పార్లమెంటు(Parliament elections) కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా సంగారెడ్డిలోని పిఎస్ఆర్ గార్డెన్స్ లో సిపిఎం ఏర్పాటు చేసిన విస్తృ తస్థాయి సమావేశానికి మంత్రి సురే ఖ ముఖ్య అతిథిగా హాజరై ప్రసం గించారు. మెదక్ నియోజకవర్గం నుంచి ఎంపిగా గెలిచిన ఇందిరా గాంధీ ఎన్నో పరిశ్రమలు స్థాపించి కార్మికులు, కర్షకులకు ఉపాధి కల్పించారని అన్నారు. రాజీవ్ గాంధీ కాలంలో అమలు చేసిన రిజర్వేషన్లే తనను ఎంపిపి నుంచి మంత్రిగా ఎదిగేలా ప్రోత్సహించా యని అన్నారు.
రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారని అన్నారు. కమ్యూనిస్టు సోదరులు మాట ఇస్తే మాట తప్పరు,మడమ తిప్పరు మాట ఇస్తే ఎవరినైనా ఎదిరించేం దుకు సిద్ధంగా ఉంటారని, బిసి బిడ్డ నీలం మధును గెలిపించేందుకు వారంతా ఏకం కావడం శుభపరిణా మమని బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి ప్రజల భూములను లాక్కొని వాళ్ళనే ఓట్లడిగేందుకు వస్తున్నాడని ఆరోపించారు. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఎమ్మె ల్యేగా ఉన్నప్పటికీ ప్రజలను పట్టిం చుకోలేదు గానీ ఇప్పుడేమో ఎంపి గా పోటీ చేస్తున్నాడని, మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకునేందుకు ఎందా కైనా పోరాడే వ్యక్తి నీలం మధు అని కొనియాడారు.
కార్మికుల సమస్యల ను పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నెంబర్(toll free number) ద్వారా అందుబాటులో ఉంటానని ప్రకటించడం నీలం మధు నిబద్ధతకు నిదర్శనమని మంత్రి సురేఖ అన్నారు. అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నా రనీ, ఇలా అయితే మన భవిష్య త్తు ప్రశ్నార్థకం అవుతుందని మంత్రి సురేఖ అన్నారు. మోడీకి అదానీ, అంబానీలకు ఏం కావాలో చూసు కుంటాడు గానీ ప్రజల సంక్షేమం పట్టదని అన్నారు. కాబట్టీ పొరపా టున కూడా బిజెపి(BJP) కి ఓటేస్తే దేశాన్ని ప్రైవేటీకరణ వైపు నడిపించి మన జీవితాల్ని ఆగం చేస్తుందని మంత్రి సురేఖ హెచ్చరించారు. ప్రజా సంక్షే మానికి పాటుపడే నీలం మధును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకో వాలని మంత్రి సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు.
Congress laid foundation country progress