Suicide : ప్రజా దీవెన సంగారెడ్డి: కారణాలే మైనా కన్నతల్లి కర్క శంగా మారిన వైనం వెలుగులోకి వచ్చింది. కడు పుతీపి మరిచి నవమాసాలు మోసి కన్న పిల్లల కడుపులోకి విషం పంపి మరీ ఆయువు తీసింది. తన ము గ్గురు పిల్లలకు విషాహారం పెట్టి అ భంశుభం తెలియని పిల్లలను కళ్ళ ముందే కడతేర్చింది. నాలుగు గోడల మధ్య ఏమీ జరిగిందో కానీ తిన్నె అన్నం లో తన చేతుల్లాల విషం కలిపి ముగ్గురు పిల్లలను చంపి తనుకూడా ఆత్మహత్య కు పాల్పడిన హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా అమీ న్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేం ద్రనగర్ కాలనీలో గురు వారం రాత్రి జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలు మృతి చెం దడంపై అనేక అనుమానాలు వ్య క్తం అవుతున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడక పల్లి గ్రామానికి చెందిన అవురిజింతల చెన్నయ్య గత కొంతకాలంగా కుటుంబంతో కలిసి అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాల నీలో అద్దె ఇంట్లో నివా సం ఉంటూ వాటర్ ట్యాంకర్ డ్రై వర్ గా పని చేస్తున్నాడు.
చెన్నయ్యకు భార్య రజిత అలియాస్ లావణ్య, ముగ్గరు పిల్లలు సాయి క్రిష్ణ(12), మధుప్రియ(10), గౌత మ్(8) ఉన్నారు. గురువారం రాత్రి 9గంటల సమయంలో పిల్లలతో కలిసి రజిత పెరుగన్నం తిన్నారు.చెన్నయ్య అన్నం, పప్పు మాత్రమే తిన్నాడు. పెరుగు తినలేదు. ఆ త రువాత చెన్నయ్య వాటర్ ట్యాo కర్తో చందానరగ్కు నీటి సరఫరా కోసం వెళ్లి తిరిగి రాత్రి 11గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చా డు. భార్య రజిత తలుపులు తీ సింది. అప్పటికే పిల్లలు నిద్రపోతు న్నారు.
అయితే రాత్రి 3గంటల స మయంలో రజితకు తీవ్రమైన కడు పు నొప్పి రావడంతో బిగ్గరగా అరి చింది. చెన్నయ్య పక్కింటి వాళ్ల స హాయంతో తన భార్యను బీరం గూడలోని పనేసియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరో గ్య పరిస్థితి బాగానే ఉంది. ఇంట్లో నిద్రిస్తున్న పిల్లలను పరిశీలించగా ముగ్గురు మృతి చెందారు. పిల్లల మృతిపై పలు అనుమానాలు వ్య క్తం అవుతున్నాయి. విష ఆహారం తినడంతోనే మృతి చెందారా, తినే ఆహారంలో ఎవరైన విషం కలిపారా లేదా కారణం ఏమైనా అనుమాన కేసు అనే కోణంలో పోలీసులు ద ర్యాప్తు చేస్తున్నారు.
సంఘటన స్థలాన్ని అమీన్ పూర్ సీఐ నరేశ్, ఎస్ఐ లు విజయ్ రావు, సోమే శ్వరి పోలీస్ సిబ్బందితో కలిసి పరి శీలించి రజిత భర్త చెన్నయ్యను విచారించి పలు వివరాలు నమో దు చేసుకున్నారు. క్లూస్ టీమ్, పో లీస్ లు విచారణ జరుపుతు న్నా రు. అయితే కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా కలహాలు కానీ, కుటుంబ విభేదాల కారణంగా ఈ దుర్ఘటన జరిగిందా అని కూడా పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.