Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sakhi Center: మహిళలకు అండగా సఖి కేంద్రం..!

ప్రజా దీవెన, సూర్యాపేట:
Sakhi Center: మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సఖి కేంద్రాల ద్వారా బాధిత స్త్రీలకు అండగా నిలుస్తుందని సూర్యాపేట సఖి కేంద్రం కేస్ వర్కర్ పి. భవాని తెలిపారు సూర్యాపేట మండల పరిధిలోని శనివారం ఎండ్లపల్లి, రామారం, రత్నపురం, ఉపాధి హామీ కూలీలకు సఖి కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

గృహహింస, వరకట్నం, ప్రజలు పనిచేసే చోట లైంగిక వేధింపులు, ఆడపిల్లల అమ్మకం, ఆడపిల్లల అక్రమ రవాణా, ఇతరుల నుంచి సమస్యలు ఎదుర్కొనే అతివలు, బాలికలకు భరోసా కల్పిస్తున్నామని కౌన్సిలింగ్ నిర్వహిస్తూ అవసరమైన వారికి పోలీసుల సేవలు, న్యాయపరమైన సేవలు ఉచితంగా అందిస్తూ కష్టాల కడలి నుంచి ఒడ్డుకు చేరుస్తున్నామని మహిళలకు ఏ కష్టం వచ్చినా హెల్ప్ లైన్ నెంబర్ 181 కు కాల్ చేసి సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ నిర్వాహకులు, కూలీలు పాల్గొన్నారు.