Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Badibata: బడిబాట ప్రారంభించిన ప్రధానోపాధ్యాయులు

కోదాడ మండల పరిధిలోని గుడిబండ రామలక్ష్మి పురం గ్రామాలలో పిఎస్ జడ్పీహెచ్ జెడ్ పి హెచ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు, విమల కుమారి అధ్వర్యంలో గురువారం బడిబాట కార్యక్రమాన్నిప్రారంభించారు.

ప్రజా దీవెన, కోదాడ : కోదాడ మండల పరిధిలోని గుడిబండ రామలక్ష్మి పురం(Gudibanda Ramalakshmi Puram)గ్రామాలలో పిఎస్ జడ్పీహెచ్ జెడ్ పి హెచ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు,(Hanumantha Rao)విమల కుమారి అధ్వర్యంలో గురువారం బడిబాట(Badibata) కార్యక్రమాన్నిప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు(Textbooks)ఏకరూప దుస్తులు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారని ఈ అవకాశాన్ని గ్రామాల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మానసిక వికాసానికి ఆడుకునేందుకు విశాలమైన ప్రాంగణము ఉంటుందని తెలిపారు చదువుకునే పిల్లలను ప్రైవేట్ గా పని చేసే కార్మికు పిల్లల్ని బళ్లో చేర్పించుట తల్లిదండ్రులను ఒప్పించాలని తెలిపారు అనంతరం గ్రామాల పురవీధులలో తల్లిదండ్రులకు పిల్లలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో బడుగుల సైదులు ఉపాధ్యాయులు సరిత ధనలక్ష్మి ధనమూర్తి కృష్ణకుమారి నరసింహారెడ్డి నరసింహారావు నారాయణరావు వెంకట్ నారాయణ బాలాజీ రామిరెడ్డి దుర్గారావు గ్రామస్తులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Badibata started in kodad