Sunitha Jagadish Reddy : ఆడపడుచులకు అవమానo రాహుల్ వ్యాఖ్యలు
సూర్యాపేట పట్టణం లోని 23,౩1 వార్డ్ లలో బిఆర్ఎస్ అభ్యర్ధి కంచ ర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సతీమణి సునీత జగదీష్ రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే సతీమణి కంచర్ల రమాదేవి తో కలిసి గడపగడపకు ప్రచారం నిర్వహించారు.
మహిళలకు రూ. 2500 ఇచ్చా మనడం
ఆరు గ్యారెంటీ లు కాంగ్రెస్ గారడీ మాటలు
బీజేపీ సైతం గజదొంగల వ్యవ హారాలు
కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి అబ ద్దాలకు పునాదులు
సూర్యాపేటలో జోరుగా గులాబీ శ్రేణుల ప్రచారాలు
ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యాపేట పట్టణం లోని 23,౩1 వార్డ్ లలో బిఆర్ఎస్ అభ్యర్ధి కంచ ర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సతీమణి సునీత జగదీష్ రెడ్డి,(Sunitha Jagadish Reddy) నల్లగొండ మాజీ ఎమ్మెల్యే సతీమణి కంచర్ల రమాదేవి తో కలిసి గడపగడపకు ప్రచారం నిర్వహించారు. మహిళల కు 2500 ఇచ్చినం అని రాహు ల్ గాంధీ చెప్పడం హాస్యాస్పదం అనీ, ఇది ముమ్మాటికి తెలంగాణ ఆడప డుచులను అవమానించ డమే అని గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట లోజోరుగా గులాబీ శ్రేణుల ప్రచారం కొనసాగు తుంది. నలగొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి(Kancharla Krishna Reddy) మద్దతుగా గుంటకల్ సునీత జగదీష్ రెడ్డి గడపగడప ప్రచారం విజయవం తంగా, అపూర్వ ప్రజాస్పందన మధ్య కొనసాగుతోంది. ఈరోజు పట్టణంలోని 23, 31 వ వార్డులలో బిఆర్ఎస్ శ్రేణులు, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సతీమణి రమాదేవితో కలిసి సీతా జగదీష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓట్ల కోసం ఇంతటి అబద్ధాలకైనా పూనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు.
కాంగ్రెస్వి గారడీ గ్యారెంటీ లు..
బీజేపీవి(BJP) దొంగ మాటలు అన్న సునీత జగదీష్ రెడ్డి,కాంగ్రెస్, బీజేపీని నమ్మద్దని ప్రజలకు సూచించారు.కాంగ్రెస్ పాలన లొ అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. దేశంలో మహిళల కోసం ఆలోచించిన ఏకైక నాయకు డు కేసీఆర్(KCR) అన్నారు.మహిళా పక్ష పాతి బిఆర్ఎస్ అన్నారు. గత ప్రభుత్వం లొ పథకాలకు మహిళల పేరు పెట్టడం తో పాటు, కల్యాణ లక్ష్మి ,కెసిఆర్ కిట్, అమ్మ ఒడి, వంటి ఎన్నో పథకాలను తీసుకు వచ్చి ఆడపడుచుల కళ్ళల్లో ఆనందం నింపిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందన్నారు.
ప్రస్తుత పాలనలో పెంచిన పెన్షన్ ఇవ్వకపోగా, గతంలో ఇచ్చిన పెన్షన్లను సరైన సమయంలో ఇవ్వకపోవడంతో ఒంటరి మహిళలు ,వృద్ధులు, తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు అని వాపోయారు.ఇప్పుడు మళ్లీ ప్రజలను నమ్మించేందుకు అడ్డగోలు హామీలు ఇస్తున్నారని దుయ్య బట్టారు. మే 13వ తేదీన కారు గుర్తుకు ఓటు(Vote) వేసి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ (Congress)బిజెపిలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.సమయానికి పెన్షన్ రావడం లేదన్న వృద్ధురాలు..తన ఇద్దరు కొడుకులు చనిపోవడంతో అనాధ నయ్యానని, గత పాలనలో పెద్ద కొడుకుల కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ తనకు ఆధారమైందన్న అవ్వ, ప్రస్తుతం పెన్షన్ రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని బోరున వినిపించారు.
మరొక అవ్వ తన కు ఎవరూ లేరనే భావన రాకుండా తమ పెద్ద కొడుకు కేసీఆర్ గత బిఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో సమయానికి పెన్షన్లు వచ్చి తమ కడుపులు నింపితే, ప్రస్తుత ప్రభుత్వంలో ఎప్పుడు వస్తాయో తెలవని పెన్షన్లతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని , 31 వ వార్డులో వృద్ధులు సునీత జగదీష్ రెడ్డి తో వాపోయారు. ప్రచారానికి వెళ్లిన సునీత జగదీష్ రెడ్డిని చూస తమ పడుతున్న ఇబ్బందులను చెప్పుకుంటూ కన్నీటి పర్వంతమయ్యారు. తమ మద్దతు కేసీఆర్ కి అని, నాలాంటి ఎంతోమంది అభాగ్యులకు గులాబీ జెండాని అండ , జై తెలంగాణ అంటూ నినదించారు.
Congress and BJP says lies