Jagdish Reddy: కాంగ్రెస్ ను కాటికి పంపడం ఖాయం
పార్లమెంట్ ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీని కాటికి పంపి బొంద పెట్టడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది
బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్న మాజీ మంత్రి జగదీశ్రీరెడ్డి
ప్రజా దీవెన, కోదాడ: పార్లమెంట్ ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీని కాటికి పంపి బొంద పెట్టడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Jagdish Reddy) అన్నారు. నల్లగొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కోదాడ నియోజకవర్గం మోతే, నడిగూడెం మండల కేంద్రాల్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్(Congress) తెచ్చిన కరువు అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి రైతు పొలాలకు నీళ్లు తెస్తే కాంగ్రెస్ సర్కారు వచ్చి రైతుల కళ్లలో నీళ్లు తెచ్చిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్(BRS) హయాంలో మోతే మండలానికి కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు నీరు అందించి సద్యశ్యామలం చేశా మని చెప్పారు. ఎవరికి వేసిన ఓటు ముంచి చేసిందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు.
కాంగ్రెస్ వాళ్లను ముుకర్రతో గుచ్చి అనగపె ట్టి పని చేయించుకోవాలని, లేకుం టే వాళ్లకు పని చేసే నేతకాదని అన్నారు. రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ అంటే సమ్మ ఓటేస్తే రైతు బంధు ఇవ్వలేదని, ఎకరాకు రూ.15వేలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. వద్దకు క్వింటాకు రూ. 500 బోనస్, మహిళలకు రూ.2500, కళ్యాణలక్ష్మి బబ్దిదారులకు తులం బంగారం, నిరుద్యో గులకు రూ.4వేల భృతి ఇస్తామని చెప్పి ఇప్పటికి నెర వేర్చలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాలేజీ విద్యార్థినులకు డిసెంబర్ 9న ప్రియాంకగాంధీ కళ్ల స్యూటీలు ఇస్తామని చెప్పారని ఎక్కడ ఉన్నాయని ప్రజలను ప్రశ్నించారు. ఆటో కార్మికులకు రూ.12 వేలు ఇస్తామని ని చెప్పి బువ్వకు 2 కూడా లేకుండా దేశారని ఆరోపిం చారు.రూ.4వేల పెన్షన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ము సల్లను కూడా మోసం చేశారని అన్నారు.
కాళే శ్వరం జలాలతో రైతులకు(Farmers) నీరు అందించి అనుకున్నా మని, ఉత్తమకమాన్రెడ్డి నీటి పారుద మంత్రిగా ఉండి ఇక్కడి పొలాలను ఎండబెట్టారని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)మంత్రిగా అందిందిన బహుమానం 12 నుంచి 14లక్షల ఎకరాలు ఎండబె ట్టడమేనని ఎద్దేవా చేశారు. అదే జెసీఆర్ గెలిని ఉంటె ఈ రోజు మన నీళ్లు మనకు వచ్చేవని, మన సంక్షేమ నిధులు మనకు అందేవని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని, కారు గుర్తుకు ఓటు వేసి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్య క్రమాల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎంపీపీ యాతరల జ్యోతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు శీలం సైదులు, సచ్చిరెడ్డి, నాయకులు చంద్రయ్య, ఆంజనేయులు, మహేశ్ ఖలీల్ అహ్మద్, మధుసూదన్ రెడ్డి, లింగారెడ్డి, వెంకటే శ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
Congress defeat in parliament elections