ప్రజా దీవెన, కోదాడ:
Ganja Seizure: అనంతగిరి పోలీసులు చేసిన ఆకస్మిక తనిఖీలలో గంజాయి కొనుగోలు చేసి సేవిస్తూ మిగిలిన భాగాన్ని విక్రయిస్తున్న నలుగురు యువకులు అరెస్టయ్యారు. ఈ విషయాన్ని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి సోమవారం కోదాడ రూరల్ సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు వివరాల ప్రకారం అనంతగిరి గ్రామ శివారులో చాకలిగుట్ట వద్ద నలుగురు వ్యక్తులు గంజాయి తీసుకుంటున్నారని అందిన విశ్వనయ్య సమాచారం మేరకు పోలీసు అక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు.
దర్యాప్తులో ఖానాపురం గ్రామానికి చెందిన కనగాల సతీష్ వద్ద ఒక కిలో అనంతగిరికి చెందిన షేక్ సైదబాబు నడిగూడెం మండలానికి చెందిన షేక్ సైదా బాబా నడిగూడెం మండలానికి చెందిన బడేటి వెంకటేశు చెవుల శ్రీకాంత్ వద్ద ఒక కిలో ముగ్గురు వద్ద 300 గ్రాములు చొప్పున మొత్తం 1.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వారి వద్ద మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గత కొంతకాలంగా పరస్పర పరిచయంతో కలిసి గంజాయి కొనుగోలు చేసి సేవిస్తూ మిగిలిన భాగాన్ని ఇతరులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడయింది. ఈ వ్యవహారానికి మిర్యాలగూడ చెందిన గంజాయి కేసులో అప్పటి నిందితుడైన భాను ప్రకాష్ అనే వ్యక్తి ప్రధానంగా సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు.
ఈ నెల 8వ తారీఖున భాను ప్రకాష్ మల్కానగర్ నుంచి తిరిగి వస్తూ గంజాయి అందజేసేందుకు కనగాల సతీష్ కు సమాచారం ఇచ్చాడు 11వ తేదీన అనంతగిరి చాకలి గుట్ట వద్ద నలుగురు అతని కలుసుకొని ఒక కేజీ 10,000 రూపాయలకు మిగిలిన 300 గ్రాములు 3000 రూపాయల చొప్పున గంజాయిని కొనుగోలు చేశారు కొంత భాగాన్ని అక్కడే రాళ్ల మధ్య దాసి మిగిలిన గంజాయితో భాను ప్రకాష్ మోటార్ సైకిల్ పై అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోయాడు.
అదేరోజు మధ్యాహ్నం దాచిపెట్టిన గంజాయిని తిరిగి తీసుకునేందుకు వచ్చిన నలుగురిని పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను ప్రకాష్ పరారీ లో ఉన్నాడు పట్టుబడిన గంజాయి విలువ సుమారు 47,500 గా అధికారులు అంచనా వేశారు ఈ ఆపరేషన్లు కోదాడ రూరల్ సీఐ జి రజిత రెడ్డి నేతృత్వంలో ఎస్సై నవీన్ కుమార్, కానిస్టేబుల్ నిరంజన్ సతీష్, శ్రీను, నరసింహ, పాల్గొన్నారు.