Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Padmavathi Reddy: నియోజకవర్గంలో ఉన్నగ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు: పద్మావతి రెడ్డి

ప్రజాదీవెన, కోదాడ:
MLA Padmavathi Reddy: కోదాడ నియోజకవర్గంలోగ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ మండలం దొరకుంట, చిమిరియాల గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించారు. ముందుగా దొరకుంట గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ పాలకి అర్జున్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జున్ గ్రామానికి పార్టీకి చేసిన సేవలను గుర్తుచేసి కొనియాడారు. నిరంతరం గ్రామ ప్రజల అభివృద్ధికి పాటుపడ్డ వ్యక్తి అర్జునునని తప్పనిసరిగా వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం చిమిరియాల గ్రామంలో ఎన్ ఆర్జిఎస్ నిధులు 20 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పంచాయతీ భవనాలను తొలగించి నూతన భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ఎక్కడ వెనకడుగు వేయడం లేదని గ్రామాలలో నాయకులు అభివృద్ధి కోసం నిధులు అడిగిన వెంటనే మంజూరు చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ పూర్తిస్థాయిలో స్థానాలను కైవసం చేసుకుంటుందని కార్యకర్తలు నాయకులు సంసిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, జిల్లా గ్రంధాలయ అధ్యక్షుడు వంగవీటి రామారావు, తాసిల్దార్ వాజిద్ అలీ, ఎంపీడీవో రామచంద్రరావు, చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ కొత్త రఘుపతి మండల పార్టీ అధ్యక్షుడు తూమాటి వరప్రసాద్ రెడ్డి, కొత్త గురవయ్య, పాలకి సురేష్, కొండాపూర్ణ, గద్దెల వెంకటేశ్వర్లు,
హనుమంతరావు, గద్దె నరేందర్, మాజీ సర్పంచ్ కొండా శైలజ, ఎర్రమల బెంజిమెన్, శరబయ్య, ముండ్ర రంగారావు తదితరులు పాల్గొన్నారు.