కోదాడలో పార్లమెంటు ఎన్నికలకు సర్వం సిద్ధం
నల్లగొండ పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి కోదాడ నియోజకవర్గంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ప్రజా దీవెన, కోదాడ: నల్లగొండ పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి కోదాడ నియోజకవర్గంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని బాలాజీ నగర్ లో గల ప్రభుత్వ గోదాం వద్ద పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలను, ఎన్నికల సామాగ్రిని ఆర్డీవో సూర్యనారాయణ పర్యవేక్షణలో పంపిణీ చేశారు. కోదాడ నియోజకవర్గంలో మొత్తం 2,45,187 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,19,172 మంది కాగా మహిళలు 1,25,997 మంది ట్రాన్స్ జెండాలు 18 మంది ఉన్నారు.
నియోజవర్గంలో మొత్తం 296 పోలింగ్ బూత్ లు ఉండగా 1500 మంది పోలింగ్ సిబ్బంది 700 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. కాగా బాలాజీ నగర్ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ వెంకట్రావు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తో కలిసి తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.
parliamentary elections in Kodada