–సూర్యాపేట జిల్లాలో చదువురాని పిల్లలు ఉండకూడదు ……
–విద్యా ద్వారానే భవిష్యత్తుకు పునాది బాటలు ఏర్పడతాయి
–జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
District Collector Tejas Nand Lal Pawar : ప్రజా దీవెన సూర్యాపేట జిల్లా :ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా భోదించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో హుజుర్నగర్ నియోజకవర్గం పరిధిలోని గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు, మట్టంపల్లి, హుజుర్నగర్, మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాలకి చెందిన ఎం ఈ ఓ, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో ఫౌండేషన్ లీటరసీ న్యూమరసీ (ఎఫ్ ఎల్ యన్ ) పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో క్రమశిక్షణతో కూడిన చదువు చెప్తామని విద్యార్థుల్లో నమ్మకం కల్గించి ప్రతి ఒక్క పాఠశాలకు రాని విద్యార్థులను గుర్తించి వచ్చే విద్యా సంవత్సరంకి ఎక్కువ మంది విద్యార్థులు నమోదు అయ్యేలా ఉపాధ్యాయులు, హెడమాస్టర్స్ కృషి చేయాలని సూచించారు.
ప్రతి రోజు విద్యార్థులకి తెలుగు రాయటం, చదవటం నేర్పించెందుకు ఉపాధ్యాయులు సమయం కేటాయించాలని సూచించారు విద్య సంవత్సరం ప్రారంభం కాకముందే ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్లు మొదటగా ప్రణాళికలు రూపొందించుకొని మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని అందుకుగాను చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రణాళిక బద్ధంగా నైపుణ్యంతో సులభమైన పదాలు నేర్పి తదుపరి కఠినమైన పదాలు నేర్పాలని అర్ధం కానీ విద్యార్థులకి వీడియోల ద్వారా తెలుగు, హిందీ భాషలు నేర్పించాలని మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులలో కూడా విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలని తెలిపారు. హుజుర్నగర్ నియోజకవర్గంలో చాలా మండలాలలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉన్నదని, కూలి పనుల కోసం పిల్లలను తీసుకొని ఇతర ప్రాంతాలకు వలసలు పోవు కుటుంబాలను గుర్తించి అట్టివారికి అవగాహన కల్పించి పిల్లలను పాఠశాలకు పంపే విధంగా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని కలెక్టర్ అన్నారు. మండలాలలో కొన్ని పాఠశాలలో మెరుగైన ఫలితాలు ఉన్నాయని, మిగతా పాఠశాల లో కూడ మెరుగైన ఫలితాలు కొరకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు.
ఉపాధ్యాయులు భాద్యతగా ఉంటూ గత సంవత్సరం లో జరిగిన వైఫల్యాలు సరిచేసి వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రాధమిక పాఠశాలలో తెలుగు భాష రాయటం, చదవటం అలాగే ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ లో కనీస సామర్థ్యాలు, అలాగే జడ్పి ఉన్నత పాఠశాలలో ఎల్ టి ఐ మొదటి 60 రోజులలో నేర్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
విద్యార్థులకి నేర్పించే పద్ధతులు మారినాయి కానీ ఫలితాలు రావటం లేదని ఇక నుండి మండల స్థాయి లో, జిల్లా స్థాయి లో ఎఫ్ ఎల్ ఎన్ పై సమీక్షలు నిర్వహిస్తామని ప్రతి పరీక్షకి విద్యార్థుల చదువులో పురోగతి ఉండాలని తెలిపారు.
ప్రతి వారం వీక్లీ సెల్ఫ్ అసెస్ మెంట్ లో వెనకబడిన విద్యార్థులు ఎలా మెరుగుపర్చాలో అలోచించి మంచి సంకల్పంతో పని చేసి ఆలోచనలను ఆచరించేలా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ఎఫ్ ఎల్ ఎన్ పై 60 రోజుల కార్యాచరణ లో భాగంగా బృందాలు ఏర్పాటు చేసి పేపర్లు తయారు చేసి అందరికి కనీస సామర్థ్యాలు నేర్పించి జిల్లాలో తెలుగు రాయటం, చదవటం రాని వారు ఉండవద్దు అని, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద పెట్టి డిజిటల్ క్లాస్ లు నిర్వహించి అర్ధం అయ్యేలా భోదించాలని తెలిపారు.మంచి ప్రదర్శన చూపెట్టిన విద్యార్థులకి పెన్నులు, పుస్తకాలు ఇచ్చి అభినందించాలని అన్నారు.విద్యార్థుల పట్ల టీచర్లు స్నేహ పూర్వకంగా ఉంటూ కనీస సామర్థ్యాలు నేర్పాలని ఎం ఈ ఓ లు,కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు విద్యార్థులవారీగా, పాఠశాల వారీగా పరిశీలించాలని తెలిపారు.
ఇప్పటి నుండి ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా అందరు ప్రతి విద్యార్థివి అసెస్ మెంట్ రిపోర్ట్, వార్షిక పరీక్షల రిపోర్ట్, విద్యార్థుల పని తీరు, తెలుగు ఇంగ్లీష్, గణితంలో కనీస సామర్థ్యాలు, ఎఫ్ ఎల్ ఎన్ అలాగే వార్షిక పరీక్షలు పై రిమార్కులు,విద్యా సంవత్సరం లో విద్యార్థులు ఉపాధ్యాయులు చేపట్టిన మంచి కార్యాచరణ, వెనకబడిన విద్యార్థుల జాబితా రూపొందించి వారిని ఎలా మెరుగుపర్చాలనే ప్రణాళికలు సిద్ధం చేసి హెడ్ మాస్టర్ కి అప్పగిస్తే హెడ్ మాస్టర్ పాఠశాల మొత్తం నివేదిక మండల విద్యాధికారికి సమర్పించాలని తెలిపారు.
ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని తీవ్రంగా పరిగణించి విద్యార్థుల సంఖ్య పెంచాలని, పాఠశాల లో చేరిన వారికి మెరుగైన విద్యా భోదించాలని అన్నారు. జిల్లాలో ఉర్దూ మీడియం పుస్తకాలు కొరత ఉందని ఉపాధ్యాయులు కలెక్టర్ కి సూచించగా వెంటనే కలెక్టర్ ఉర్దూ మీడియం పుస్తకాలను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డి ఇ ఓ ను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఈఓ ఆశోక్, క్వాలిటీ కో ఆర్డినేటర్ జనార్దన్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్, ఇంక్లూజివ్ కో ఆర్డినేటర్ రాంబాబు, జనరల్ ఈక్వలిటీ కో ఆర్డినేటర్ పూలమ్మ, ఎం ఈ ఓ లు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.