–సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ
ప్రజా దీవెన సూర్యాపేట:
SP Narasimha: విద్యా సంస్థలు, పాఠశాలలు ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా పాఠశా లలకు విద్యార్థులను రవాణా చేసే వాహనాలు మంచి కండిషన్ లో ఉండాలని, వాహనాల నిర్వహణలో నియమనిబంధనలు పాటించాలని, స్థితిగతులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి, లోపాలు సవరించుకోవాలి అని జిల్లా ఎస్పీ నరసింహ విద్యాసంస్థల యాజమాన్యాలను, వాహనాల యజమానులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యా సంస్థలకు విద్యార్థులను రవాణా చేస్తున్నటువంటి బస్సులు, వ్యానులు, ఆటోలు, ఇతర రవాణ తరహా వాహనాలు ఏవైనా మంచి కండిషన్ లో ఉండాలని, వాటి నడిపే డ్రైవర్లు మంచి నైపుణ్యం కలిగి క్రమశిక్షణతో వాహనాలు నడపాలి అన్నారు. వాహన సామర్ధ్యానికి మించి పిల్లల ను రవాణా చేయవద్దు అన్నారు.
వాహనాల్లో మ్యూజిక్ పరికరాలు ఉపయోగించవద్దు అని అన్నారు. అతివేగంగా వాహనాలు నడపవద్దు, మద్యం మత్తులో వాహనాలు నడపవద్దు, రోడ్డు క్రాసింగ్ ల వద్ద అత్యంత జాగ్రత్తగా ఉండాలి అన్నారు. విద్యార్థులను తీసుకొచ్చే క్రమంలో అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. పోలీసు తనిఖీలు నిర్వహిస్తాం నిభందనలు పాటించకపోతే చర్యలు తప్పవు అన్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.