Vote: ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
కోదాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్లందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్ లు అన్నారు.
ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి
ప్రజా దీవెన, కోదాడ: కోదాడ నియోజకవర్గ(Kodada Constituency) పరిధిలో ఉన్న ఓటర్లందరూ(vote) తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్ లు అన్నారు. ఆదివారం పట్టణములోని స్థానిక ఎస్ ఆర్ యం స్కూల్ లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంట్(Nalgonda parliament) నియోజకవర్గానికి సోమవారం జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. వారి వెంట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి ,తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Voters caste vote in Kodada Constituency