Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: వేగిరంగా టెక్స్ టైల్ పార్క్ పనులు

–స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశం
–భూ నిర్వాసితుల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు, ఆ గ్రామాల‌న్నీ క‌లిపి ఒక‌ పంచాయ‌తీగా ఏర్పరుస్తాo
–వ‌న‌మ‌హోత్స‌వంలో మొక్క‌లు నాటిన‌ సీఎం, మంత్రులు
–కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పా ర్కు సందర్శన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ప్రజా దీవెన, వరంగల్: కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పనులను మరింత వేగవంతంగా ముందుకు తీసు కెళ్లాలని తెలంగాణ ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు.భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాల‌ని అధికారుల‌కు (officers) సూచించారు. 1200 నుంచి 1400 వరకు భూ నిర్వాసితులు ఉన్నారని, నిర్వాసిత పున‌రవాస ప్రాంతాల‌ను క‌లిపి ఒక పంచాయ‌తీగా ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఆ పంచాయ‌తీలో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని క‌లె క్ట‌ర్‌ను ఆదేశించారు. శ‌నివారం వ‌రంగ‌ల్ జిల్లా సంగెం మండ‌లం చింత‌ల‌ప‌ల్లి, సాయంపేట ఊక‌లు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కాక‌తీయ మెగా టెక్స్ టైల్స్ పార్కు ను సంద‌ ర్శించారు. టెక్స్ టైల్స్ పార్కు (Tex Tiles Park) ల్లో స్థానికులకు ఉపాధి క‌ల్పంచాల‌ని ఆదేశించారు.

సీఎం రేవంత్‌కు (CM Revanth Reddy) ఘ‌న స్వాగ‌తం.. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి న తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ((CM Revanth Reddy))ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. చింత‌ల‌ప‌ల్లి, సాయంపేట ఊక‌లు లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌కు ప్ర‌త్యేక హెలికా ప్ట‌ర్‌లో చేరుకున్నారు. ఇక్క‌డ‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ((CM Revanth Reddy)) మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యే లు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.టెక్స్‌టైల్స్ పా ర్కులోని ఏర్పాటు చేసిన వ‌న‌మ‌ హోత్స‌వ‌ కార్య‌క్ర‌మంలో సీఎం రేవం త్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొని మొక్క‌లు నాటారు. ఆయ‌న‌తో పాటు మంత్రులు పొంగు లేటి శ్రీ‌నివాస రెడ్డి, దామోద‌ర రాజ‌ న‌ర్సింహ, కొండా సురేఖ‌, సీత‌క్క‌, కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి త‌దిత‌రు లు కూడా మొక్క‌లు నాటారు. అనంత‌రం మ‌రికొన్ని టెక్స్‌టైల్స్ పార్కుల‌ను సీఎం సంద‌ర్శించారు. అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిభిష‌న్‌ను ఆయ‌న ప‌రిశీలించా రు. వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైల్ ప్రాంతం లో నిర్మాణంలో ఉన్న 24 అంతస్థు ల మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రిని సీఎం రేవంత్ రెడ్డి సంద‌ర్శించారు.