–నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజలు ఈ సోమవారం సైతం మండల స్థాయి లో నిర్వహించే ప్రజావాణిలొనే (prajavani) ఫిర్యాదులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సి .నారాయణరెడ్డి (narayana Reddy)తెలిపా రు. ఈ సోమవారం జూలై 8 వ తేదీ నుండి జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని (prajavani program)యధావిధిగా నిర్వ హించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నా రాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలి పారు. ఈ సోమవారం నల్గొండ జిల్లా(Nalgonda )కేంద్రానికి వచ్చి ఫిర్యాదులు సమర్పించాలనుకొనే పిర్యాదు దారులు సంబంధిత మండలా లలో నిర్వహించే ప్రజావాణి కార్య క్రమంలోనే ఫిర్యాదులు సమర్పిం చాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమ స్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కారం కావా లన్న ఉద్దేశ్యంతో గత సోమవారం మొదటిసారిగా మండల స్థాయి లో నిర్వహించిన ప్రజావాణి కార్య క్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని పటిష్టం చేసేందుకు ఈ వారం సైతం మండల స్థాయిలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అయితే తదుపరి అపై వచ్చే సోమవారo నుండి జిల్లా ప్రజావాణి కార్యక్రమం (prajavani program)యధావిధిగా నిర్వహిస్తామని ప్రజావాణిలో విద్య, వైద్యం , అత్య వసర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు సమర్పిం చాల్సి ఉంటుందని, అలాగే మండల స్థాయిలో పిర్యాదులు సమర్పించి 15 రోజులైనా పరిష్కారం కానివి మాత్రమే జిల్లా స్థాయికి రావాలని, ఆయన పునరుద్గటించారు. భూములు(lands), ధరణి కి సంబంధించిన ఫిర్యాదులు మండల స్థాయిలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు.ప్రజలు దీనిని దృష్టిలో ఉంచుకోని ఫిర్యాదులను సమర్పించాల్సిందిగా ఆయన కోరారు.