–శంషాబాద్లో వెయ్యి ఎకరాల్లో మెడికల్ టూరిజం
–అందరికీ డిజీ కార్డులతో పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తాం
— హైదరాబాద్కు సమాంతరంగా వరంగల్ నగరం అభివృద్ధిపథం
–వరంగల్, హనుమకొండల్లో విస్తృ త పర్యటనల్లో సీఎం రేవంత్రెడ్డి
CM Revanth Reddy:ప్రజా దీవెన, వరంగల్ : తెలంగాణ రాష్ట్రాన్ని మెడికల్ హబ్గా (Medical Hub) అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పునరుద్ఘాటించారు. హైదరాబా ద్ భాగ్యనగరం విశ్వనగరంగా ఇప్ప టికే అభివృద్ధి చెందిందని విద్య, వై ద్యం, విద్యుత్తు నిరంతరం ఉండ టంతో పాటు ఫార్మా, ఐటీ, టూరి జం, విద్యాసంస్థలు నగరాన్ని ఆ స్థాయిలో నిలిపాయని పేర్కొన్నా రు. కొవిడ్ సమయంలో మన దేశం లో వ్యాక్సిన్ తయారు చేసిన నాలుగు కంపెనీల్లో మూడు హైదరాబాద్ కు చెందినవేనని గుర్తు చేశారు. శని వారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సీఎం రేవంత్ విస్తృతంగా పర్యటించారు. ఆరంభంలో వరం గల్ కాకతీయ టెక్స్టైల్ పార్కును, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి (Super Specialty Hospital) నిర్మాణ పనులను పరిశీలించి హనుమకొండ కలెక్టరేట్లో వరంగల్ నగర అభివృ ద్ధిపై సమీక్షించారు. అనంతరం హనుమకొండ హంటర్ రోడ్డులో నిర్మించిన మెడికవర్ మల్టీ నేషనల్ ఆస్పత్రిని ప్రారంభించారు.
ఈ సంద ర్భంగా రేవంత్రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ 1965లో ఇందిరాగాంధీ దూరదృష్టి తో హైదరాబాద్లో ఐడీపీఎల్ సంస్థ ను ఏర్పాటు చేశారని, ఈ సంస్థలో పరిశోధనలు చేసిన ఉద్యోగులు, చూసి నేర్చుకున్నవారే పలు కంపెనీ లు నెలకొల్పారని పేర్కొన్నారు. ఆ తరువాత రాజీవ్గాంధీ దేశంలో కంప్యూటరీకరణకు శ్రీకారం చుట్టారని, ఫలితంగానే తెలంగాణలో ఐటీ రంగం రాణించిందని, హైదరాబా ద్కు అదాయం పెరిగిందని అన్నా రు. పార్మాసిటీలే (Pharmacities) కాకుండా తెలంగా ణలో 10 నుంచి 12 వరకు ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలు మనపై ఆధార పడుతున్నాయని, అక్కడివారు వైద్యం కోసం హైదరాబాద్, చెన్నై నగరాలకు వస్తున్నారని చెప్పారు. మెడికల్ టూరిజం (Medical tourism) ఏర్పాటు మరిం త వేగవంతం ..శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో వెయ్యి ఎకరాల్లో మెడికల్ టూరిజం ఏర్పా టు చేయాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. పేద ప్రజలకు వైద్య సేవలందించే సంస్థలకు ఉచితంగా స్థలాలు కేటా యించటంతోపాటు మౌలిక సదుపా యాలు కూడా ప్రభుత్వమే కల్పి స్తుందన్నారు. ఎయిర్పోర్టులో గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి, వైద్యం కోసం వచ్చేవారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తామన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందేలా ప్రణాళిక రూపొందిస్తు న్నామని తెలిపారు. వైద్యం అందక ఏ ఒక్కరు కూడా మృతి చెందారనే వార్త వినబడవద్దన్నారు.
ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ (Health Profile) తయారు చేసి, యునిక్ నంబరుతో డిజిటల్ కార్డులు ఇస్తామని, ఈ కార్డు ద్వారా ఏ ఆస్పత్రిలోనైనా ఉచితంగా చికిత్స పొందేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. ఇక వరంగల్ నగరాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే వరంగల్కు ఎయిర్పోర్టు, మాస్టర్ ప్లాన్ వస్తున్నాయని తెలిపారు. టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, ఎకో, టెంపుల్ టూరిజం అన్నీ వరంగల్లోనే అభివృద్ధి చేసుకునే అవకాశా లున్నాయని పేర్కొన్నారు. హైదరా బాద్కు దీటుగా వరంగల్ను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని తెలిపారు. వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha)మాట్లాడుతూ హైదరాబాద్లో ఉండే అతి పెద్ద మెడికవర్ ఆస్పత్రిని వరంగల్లో ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.