–ఎన్నికల్లో మోదీది ఎన్నెన్నో అక్రమాల పర్వం
–ఈసి కి వంద పైచిలుకు పిర్యా దులు చేసినా పట్టించుకోని వైనం
–ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వా లను పడగొట్టడమే మీ విధానం
–ఈడీ, సిబిఐ, ఐటిలతో విపక్షాలపై దాడులు, అదే సమయంలో బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్
–ప్రదాని మోదీ ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారని ఆరోపణ
–రాజ్యసభలో మోదీ శైలిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధ్వజం
Modi doctrine:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీ (modi)నోటి కొచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేశా రని అఖిల భారత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) మండిపడ్డారు. కుల,మత , భాషా పరంగా విద్వే షాలు రెచ్చగొట్టారని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మోదీ (modi) 200లకు పైగా స్పీచ్ లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ117 కు పైగా స్పీచ్ లపై ఈసీకి కంప్లైంట్ చేశామని, ఈసీకి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై (President’s speech) ధన్యవాదం తీర్మాన చర్చ సందర్భంగా ఖర్గే మాట్లాడు తూ సామెతలు,సెటైర్లతో ప్రధానిపై కౌంటర్ (counter) అటాక్ చేశారు. ఎన్నికల ముందు విపక్షాల అకౌంట్లు ఫ్రీజ్ చేసి ఏన్నికల ప్రచారాన్ని ఎన్నో రకా లుగా అడ్డుకోవాలని చూశారని విమర్శించారు.
విపక్షాలను అణ గదొక్కడం మోదీకి అలవాటుగా మారిందన్నారు. చందా దేవో, దందా ఖరో మోదీ (modi) నినాదంగా మారిందని ఎద్దేవా చేశారు. ఈడీ, సీబీఐ, ఐటీలను (ED, CBI, IT) ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వాలను పడొట్టడం, నేతలను కొనుగోలు చేయడం సర్వసాధారణం అయిపోయిం దన్నారు. మహారాష్ట్ర, గోవా, మణి పూర్ లో ప్రభుత్వాలను పడగొట్టలే దా అని ప్రశ్నించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఘండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ లను అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. కేజ్రీవాల్ కు ఒక కేసులో బెయిల్ వస్తే, మరో కేసులో అరెస్ట్ (arrest) చేశారని అన్నారు. పొత్తులను అపహస్యం చేసిన మో దీ ఇపుడు పొత్తులపైనే ఆధారపడ్డా రని అన్నారు. మోదీ సినిమాలో అన్ని లీకేజీలేనని సెటైర్ వేశారు. నీట్ పేపర్ లీక్, నీట్ నీట్ పీజీ రద్దు, అయోధ్య రామాలయంలో లీక్, ఏటా 20లక్షల ఉద్యోగాలు ఏమ య్యాయని ప్రశ్నించారు. మూడేళ్ల కాలంలో 70 సార్లు పేపర్ లీక్ జరి గిందని మండిపడ్డారు. అయితే ఖర్గే వ్యాఖ్యలను కేంద్రమంత్రి నడ్డా తప్పుబట్టారు. ప్రధాని మోదీపై, కేంద్రంపై ఖర్గే ఇష్టానుసారంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాద న్నారు. దీనిపై కూడా ఖర్గే మాట్లా డుతూ తాను మాట్లాడింది తప్పని నిరూపించమంటూ నడ్డాకు సవాల్ విసిరారు. దీంతో రాజ్యసభలో కొద్దిసేపు వాదోపవాదాలు జరిగాయి.