Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Festivals of Bonala: బోనాల ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా దేవాలయాలు

–దేవాదాయ భూముల పరిరక్షణ, ఆదాయమే లక్ష్యంగా పనిచేయాలి
–దేవాదాయ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లకు కార్యాచరణ
–శిథిలావస్థకు చేరుకున్న దేవాల యాల పురోగతికి కామన్ గుడ్ ఫండ్ నిధులు

Festivals of Bonala: దేవాదాయ భూముల పరిరక్షణ, దేవాదాయ శాఖకు (Conservation of Devadaya Lands, to the Devadaya Department)ఆదాయమే లక్ష్యంగా దేవాదాయ శాఖ భూము ల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ (Konda Surekha)అధికారులకు ఆదేశించారు. ఆదాయంలేని, శిథిలావస్థకు చేరుకున్న దేవాల యాల పురోగతికి కామన్ గుడ్ ఫండ్ నిధులు వెచ్చించి, సిజిఎఫ్ నిధులకు సార్థకతను చేకూర్చాలని అధికారులకు సూచించారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో దేవాలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించి, భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సౌకర్యాల కల్పనతో పాటు తెలంగాణ సంస్కృతిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. బోనాల జాతర (bonala) రేవంత్ రెడ్డితో కలిసి బోనాల పోస్టర్, క్యాలెండర్ ను ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. మంగళవారం సెక్రటేరి యట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో దేవాదాయ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, బోనాల ఉత్సవాలకు నిధుల మంజూరు, కామన్ గుడ్ ఫండ్ (సిజిఎఫ్) నిధులు తదితర అంశాల పై మంత్రి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, అడిషనల్ కమిషనర్ లు జ్యోతి, కృష్ణవేణి, డిప్యూటి కమిషనర్ రామకృష్ణారావు, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఎస్సీ మల్లికార్జున్ రెడ్డి, డిఈ ఓం ప్రకాశ్, ఈఈ కనకదుర్గా ప్రసాద్, రెడ్కో నుండి ప్రాజెక్ట్ డైరక్టర్ బివి రామకృష్ణ, జనరల్ మేనేజర్ జీఎస్వీ ప్రసాద్, సిజిఎఫ్ కమిటి ఇతర మెండర్లు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

*దేవాదాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు…* మంత్రి సురేఖ మాట్లాడుతూ తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (TGREDCO) సహకారంతో తెలంగాణలో సాగు చేయని, ఆర్థికంగా ఉపయుక్తంగా లేని భూముల్లో సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు విధి విధానాలను రూపొందించాలని మం త్రి సురేఖ దేవాదాయ శాఖను ఆదేశించారు. ఇలా ఉత్తత్తి చేసిన విద్యుత్ ను డిస్కమ్ లకు విక్రయిం చడం ద్వారా దేవాదాయ శాఖ భూ ముల పరిరక్షణతో పాటు ప్రభుత్వా నికి ఆదాయం సమకూరుతుందని అన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు తెలంగాణ వ్యాప్తంగా అవకాశమున్న దేవాదాయ భూము లను గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. దేవా లయాల ఉపరితలాల పై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పరిశీ లించాలని సూచించిన మంత్రి సు రేఖ, ప్రాథమికంగా భద్రకాళి దేవాల యం, యాదగిరి గుట్ట దేవాలయాల పై ఎన్టిపిసి ఆధ్వర్యంలో రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు దిశ గా కార్యాచరణను వేగవంతం చే యాలని అధికారులను ఆదేశించా రు. దేవాలయాల అభివృద్ధిలో పాలు పంచుకోవాలనే దాతలు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకారం అందించే దిశగా ప్రోత్స హించాలని అన్నారు. తద్వారా దేవాలయాలకు విద్యుత్ ఉచి తంగా లభించడంతో పాటు, ఆదా యం కూడా సమకూరు తుందనీ, ఈ నిధులతో దేవాలయాల అభివృ ద్ధికి మరిన్ని చర్యలు చేపట్టేందుకు వీలవుతుందని మంత్రి స్పష్టం చేశా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలసీల ను అనుసరించి పంచాయత్ రాజ్ శాఖ, రెడ్ కో, టిఎస్ డిస్కమ్స్ లతో చర్చించి సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు మార్గదర్శకాలను రూపొందించాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు.

*సిజిఎఫ్ నిధులకు సంబంధించి ప్రత్యేకంగా ‘హెడ్ ఆఫ్ అకౌంట్’ ను సృష్టించాలి* …గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సిజిఎఫ్ కు రూ.150 కోట్ల నిధులను కేటాయించే నిమి త్తం సీఎం రేవంత్ రెడ్డిని కోరతా మని మంత్రి సురేఖ తెలిపారు. సిజిఎఫ్ నిధుల ఖర్చు విషయంలో కచ్చితత్వం కోసం ‘హెడ్ ఆఫ్ అకౌంట్’ పోస్టును సృష్టించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి సురేఖ సారథ్యంలోని కామన్ గుడ్ ఫండ్ కమిటి సిజిఎఫ్ నిధుల పై సమీక్ష చేపట్టింది. కొత్త దేవాలయాల నిర్మాణం, ఏ రకమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరని, భూ ములు, ఇతరత్రా ఆదాయం లేని దేవాలయాల అభివృద్ధి, పరిరక్షణ, భద్రత, నవీకరణ పనులకు సిజిఎఫ్ నిధులను వెచ్చించాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. సిజిఎఫ్ నిధులతో కొత్త దేవాలయా లు, కళ్యాణ మండపాల నిర్మాణం, దేవాలయాల్లో మౌలిక సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టా లని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వైభవాన్ని చాటిన ఆనాటి చారిత్రక దేవాల యాలను పునరుద్ధరించి, తెలంగా ణ ఖ్యాతిని చాటాలే వాటిని అభి వృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంతో ప్రాశస్త్యమైన వరంగల్ పురాతన శివాలయ పున రుద్ధరణ, మెట్ల బావులకు మర మ్మతులు చేపట్టడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇలాంటి ఆలయాల పునరుద్ధరణ పనులు ప్రణాళికబద్ధంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పురావస్తు శాఖతో సంప్రదించి చారి త్రక ఆలయాలను గుర్తించి, వాటి అభివృద్దికి చర్యలు చేపట్టాలని అన్నారు.

*బోనాల నిర్వహణకు దేవాల యాల కు నిధులు విడుదల…* మరికొన్ని రోజుల్లో బోనాల ఉత్స వాలు ప్రారంభం కానున్న నేపథ్యం లో దేవాలయాలకు నిధుల విడు దల ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి బోనాల (bonala) జాత ర పోస్టర్, క్యాలండర్ ను ఆవి ష్కరించనున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. పలు దేవాలయాల కమిటి మెంబర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. బోనాల ఉత్సవాల్లో అమ్మవారి వృత్తాం తాన్ని తెలిపే లేజర్ షోలు ప్రద ర్శించనున్నట్లు మంత్రి తెలిపారు. దేవాలయాల వద్ద ఎల్ఈడి స్క్రీన్లో ఈ వృత్తాంతాలను ప్రదర్శించా లన్నారు. బోనాల జాతరకు కేటా యించిన రూ. 20 కోట్ల నిధులను పలు శాఖలు, కార్యక్రమాలకు కేటా యింపుకు సంబంధించి మంత్రి సురేఖ అధికారులతో చర్చించారు. దేవాలయాల అలంకరణ, సౌకర్యా ల కల్పన, ఏనుగు సేవల వినియో గం, పర్యాటక, ప్రజాసంబంధాలు, పర్యాటక శాఖకు నిధుల కేటాయిం పు, ఢిలీలో బోనాల జాతర నిర్వహ ణకు కావాల్సిన నిధులు తదితర అంశాల పై సమావేశం చర్చించింది.
*సమావేశంలోని ఇతర నిర్ణయాలు…* దేవాదాయ శాఖలో ఏళ్ళుగా ప్రమోషన్ కు నోచుకోని ఉద్యోగులతో పాటు, ఉద్యోగుల బదిలీల విషయంలో త్వరలోనే మార్గదర్శకాలను ప్రకటిస్తామని మంత్రి సురేఖ ప్రకటించారు.
–దేవాదాయ శాఖ పరిధిలోని భూములు, షాపుల లీజ్ లకు సంబంధించి పాత మార్గదర్శకాలకు సవరణలు, మార్పులు చేసి కొత్త మార్గదర్శకాలు రూపొందించాలి. వచ్చే టెండర్లలో ఈ మార్గదర్శకా లను అమలు చేయాలి.

–అన్యాక్రాంతమైన దేవాలయాల భూముల కేసుల వాదనల విష యంలో నిపుణులైన అడ్వకేట్లను నియమించుకోవాలి.

–ధర్మపురి సంస్కృత కళాశాలలో సిబ్బంది నియామకాన్ని సీఎం దృష్టికి తీసుకుపోవాలని సమావేశం నిర్ణయించింది.

–వివిధ దేవాలయాల్లో భక్తుల నుంచి స్వీకరించిన కానుకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్న తీరు పై అధికారులను మంత్రి ఆరా తీశారు. ప్రతి కానుకకు సంబంధించిన సమస్త సమాచా రాన్ని నిక్షిప్తం చేయాలని సూచిం చారు.

–వేములవాడ గోశాలలో కోడెల మృత్యువాత పడుతున్న తీరు పై మంత్ర అధికారులను ఆరా తీశారు. పోషకాహార లోపంతో బాధపడు తున్న కోడెలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు, ఇతర కోడెల నుంచి వాటిని వేరు చేసి పోషించాలని మంత్రి సూచించారు.

–వ్యవసాయ నిమిత్తం గోశాల నుం డి గోవులను తీసుకున్న రైతులతో అగ్రిమెంట్ చేసుకోవాలని మంత్రి అధికారులకు తెలిపారు.