Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Phone Tapping Case: ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలకే ముప్పు…!

–మామూలుకాదు ప్రజాస్వామ్యా న్నే దెబ్బతీసే నేరమిది
–హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు
–ట్యాపింగ్‌ బాధిత ప్రముఖుల పేర్ల వెల్లడి
–జాబితాలో రేవంత్‌, పొంగులేటి,ఉత్తమ్‌, హైకోర్టు జడ్జి శరత్‌ తదిత రులు
— ఫోన్‌ ట్యాపింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు వివరాలు పరిశీలించాక స్పందిస్తాం
— కేంద్ర ప్రభుత్వం సైతం ఆఫడవిడ్ దాఖలు

Phone Tapping Case:ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో నే తన సంచలనంగా నిలిచిన ఫోన్ టాపింగ్ (Phone tapping) వ్యవహారం కొలిక్కి వచ్చిన ట్లే కనిపిస్తుంది. గడిచిన కొంతకా లంగా ఫోన్ టాపింగ్ కు సంబం ధించి ఊహాజనిత వార్తలు ప్రచా రాలు తప్ప అధికారికంగా ఎటువంటి నిర్దిష్ట సమాచారం బహిర్గతం కాలేదు. అయితే పెను సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బాధితుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం (State Govt) మొదటిసారిగా హైకోర్టుకు సమర్పిం చింది. ఈ కేసులో ఏ చిన్న విషయా న్నీ వదలకుండా క్షుణ్ణంగా, అత్యం త పారదర్శకంగా దర్యాప్తు చేస్తు న్నామని, తప్పించుకు తిరుగుతు న్న నిందితులతో సహా ఎవ్వర్నీ వది లిపెట్టబోమని ఉన్నత న్యాయస్థా నానికి నివేదించింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ (BRS Govt)హయాంలో రాజకీయ నాయకులు, ప్రముఖులతోపాటు ఏకంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు సైతం ట్యాపింగ్‌ చేశారంటూ వచ్చిన కథనాలను హైకోర్టు సుమో టోగా విచారణకు స్వీకరించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు (Central and State Govt) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభు త్వం, డీజీపీ, రాష్ట్రానికి సంబంధిం చిన అందరు ప్రతివాదుల తరఫునా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ (Hyderabad Police Commissioner)కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ‘‘ప్రజా స్వామ్య వ్యవస్థ మూలాలను దెబ్బ తీసే విధంగా జరిగిన తీవ్రమైన నేరం ఫోన్‌ట్యాపింగ్‌. దీని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంది.

ఎలాం టి పక్షపాతం లేకుండా చట్టానికి లోబడి సీనియర్‌ పోలీస్‌ అధికా రులు (Senior Police Officer) సహా ఈ నేరంలో బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా పార దర్శకంగా, క్షుణ్నంగా దర్యాప్తు చేస్తున్నాం. ట్రయల్‌ కోర్టులో ఇప్ప టికే చార్జిషీట్‌ Charge sheet)దాఖలు చేశాం. కేసు లోని కొత్త కొత్త అంశాలపై ఆధారా లు సేకరించడానికి, తదుపరి దర్యా ప్తు కొనసాగించడానికి ట్రయల్‌ కోర్టు అనుమతి తీసుకున్నాం. ఏ చిన్న అంశాన్నీ వదలకుండా ఆధారాలు సేకరించడంతోపాటు నిందితులు, సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేస్తున్నాం. ఇప్పటికీ ఆచూకీ లభించని నిందితుల అరెస్టుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. నిందితులు సీనియర్‌ పోలీసు అధికారులైన నేపథ్యంలో నేరం గురించి విస్తృతమైన అవగాహనతో ఆధారాలు లేకుండా చేశారు. అయి నప్పటికీ ప్రొఫెషనల్‌గా ఆధారాలు సేకరిస్తూ చట్టబద్ధంగా చార్జిషీట్‌ దాఖలు చేశామని కమిషనర్‌ ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నిం దితులు ఉల్లంఘించిన నిబంధనల గురించి వివరించడమే కాక ట్యాపింగ్‌కు (tapping) గురైనవారి పేర్లనూ వెల్లడించారు.

ఫోన్ ట్యాపింగ్‌ బాధితులు ..

అఫిడవిట్‌లో తెలిపిన ప్రకారం నిందితులు రిలయన్స్‌ జియో ఇన్‌ఫోకాం లిమిటెడ్‌ (Reliance Jio Infocomm Ltd)నుంచి జస్టిస్‌ కాజా శరత్‌, ఆయన భార్య మాధవీ గోగినేని వివరాలు సేకరించారు. అలాగే ఎనుముల రేవంత్‌ రెడ్డి (revanth reddy), కొండల్‌ రెడ్డి, తిరుపతి రెడ్డి, వినయ్‌ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొంగు లేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఈటల రాజేంద ర్‌, ఈటల నితిన్‌, శివధర్‌ రెడ్డి, ఏఆర్‌ శ్రీనివాస్‌, రాఘవేందర్‌ రెడ్డి, రొనాల్డ్‌ రాస్‌, ధర్మపురి అరవింద్‌, ఎం.రమేశ్‌ రెడ్డి, మేఘా శ్రీనివాస్‌ రెడ్డి, మైనంపల్లి రోహిత్‌, పీడీ కృష్ణకి శోర్‌, ఐఏఎస్‌ దివ్య, తాతినేని శశాంక్‌, రాజ్‌ న్యూస్‌ సునీల్‌ రెడ్డి, చిలుకా రాజేందర్‌రెడ్డి, కె.వెంకట రమణారెడ్డి, ఎన్‌టీవీ నరేంద్రనాథ్‌, తీన్మార్‌ మల్లన్న, ఏఎంఆర్‌ ఇన్‌ఫ్రా మహేశ్వర్‌రెడ్డి, వీరమళ్ల సత్యం, గాలి అనిల్‌కుమార్‌, రామసహా యం సురేందర్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌ రెడ్డి, మేరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మేరెడ్డి స్వప్నిక, ఈటల రాజేందర్‌ కెమెరామెన్‌ ఉదయ్‌, ఈటల గన్‌ మెన్‌ అంజన్న, కాసాని జ్ఞానేశ్వర్‌, బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, మానాల మోహన్‌ రెడ్డి, అనుమాండ్ల నరేందర్‌ రెడ్డి, ఫాసీఖాన్‌, కె.మహేందర్‌ తదితరుల వివరాలు సేకరించారు. ఇది ఇలా ఉంటే నిందితుల అరెస్టు రంగం సిద్ధమైంది.ఈ కేసులో ఏ–1గా ఉన్న టీ ప్రభాకర్‌రావు, ఏ–6గా ఉన్న శ్రవణ్‌కుమార్‌ రావును అరెస్ట్‌ (areest(చేయడానికి అన్నిరకాల చర్యలూ తీసుకుంటున్నామని కమిషనర్‌ అఫిడవిట్‌లో కోర్టుకు తెలిపారు. వారు తమ వీసా నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో ఉంటున్నారని.. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆధ్వర్యంలో ఇంటర్‌పోల్‌ ద్వారా వారికి బ్లూనోటీస్‌ జారీచేయడానికి ప్రయత్నిస్తున్నామని.. ఈ మేరకు సీబీఐకి ప్రతిపాదనలు అందజేశామని పేర్కొన్నారు. వారికి వ్యతిరేకంగా నాన్‌బెయిలబుల్‌ వారంట్లు జారీ అయినందున వారి పాస్‌పోర్టులు రద్దు లేదా స్వాధీనం చేసుకోవాలని రీజినల్‌ పాస్‌పోర్ట్‌ అధికారికి ప్రతిపాదనలు అందజేసినట్లు వెల్లడించారు.

కాగా.. దీనిపై వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం (Central Govt) కోర్టును కోరింది. బుధవారం ఈ కేసు విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ముందు.. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ గాడి ప్రవీణ్‌ కుమార్‌ (General Gadi Praveen Kumar) వాదనలు వినిపించారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు అనంతరం, ఆ వివరాలను పరిశీలించి కౌంటర్‌ దాఖలు చేస్తామంటూ కోర్టుకు ఒక మెమోను సమర్పించారు. ఇక.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం, అధికారుల దౌర్జన్యాలకు తాము బాధితులుగా మారామని.. తమ వాదనలు సైతం వినాలని పేర్కొంటూ సంధ్య కన్వెన్షన్‌ ఎస్‌ శ్రీధర్‌రావు, సిద్దిపేటకు చెందిన హయతుద్దీన్‌ ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వారి వాదనలు విన్న ధర్మాసనం.. ‘మీరు ఇంప్లీడ్‌ కావాల్సిన అవసరం ఏముంది? ఇది మేం సుమోటోగా తీసుకున్న కేసు. కావాలంటే మీరు ప్రత్యేకంగా పిటిషన్లు వేసుకోవచ్చు కదా?’’అని ప్రశ్నించింది. ఎందుకు ఇంప్లీడ్‌ కావాలో తాము వివరిస్తామని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొనడంతో వచ్చే వాయిదాకు చూద్దామని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను 23కు వాయిదా వేసింది.