–గడిచిన 24 గంటల్లో కూలిన మూ డు వంతెనలు
–పదిహేను రోజుల్లో 11 వంతెనలు కుప్పకూలడం గమనార్హం
Bridge Collapase: ప్రజా దీవెన, బీహార్: బీహార్ రాష్ట్రం (State of Bihar) లో నదులు వాగులు వంకలపై వంతెనలు (Bridges)ఇంకా కూలిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే గత కొద్ది రోజు లుగా ప్రతి రోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండగా, తాజాగా గురు వారం ఉదయం మరో వంతెన కు ప్పకూలింది.ఇది 24 గంటల వ్యవ ధిలో మూడోది, అలాగే,15 రోజుల్లో 11వ ఘటన కావడం గమనార్హం. సరన్ జిల్లాలోని బనియాపూర్లో (Baniapur)గండకి నదిపై సరేయ పంచాయతీ పరిధిలో ఉన్న వంతెన కూలిపో యింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం కొసమెరుపు.