Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Raj Tarun: నటుడు రాజ్ తరుణ్ కు తంటాలు

–తనను మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు
–పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని స్టేషన్ లో కంప్లైంట్

Raj Tarun: ప్రజాదీవెన, నార్సింగి: హీరో రాజ్ తరుణ్ (Raj Tarun)చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే విజయాలు లేక కెరీర్‌లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్‌లోనూ(personal life) ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో (police station) ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో (relation) ఉన్నట్లు తెలిపింది. తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది. సినీ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది. రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్‌లో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని, 45రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోతుంది. 3నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య చెబుతోంది. లావణ్య (Lavanya)ఫిర్యాదుకు అసలు కారణం మాల్వీ మల్హోత్రా. ఆమె రాజ్‌తరుణ్‌తో కలిసి తిరగబడరా సామీ అనే సినిమాలో నటించారు. అయితే మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌ జీవితంలోంచి వెళ్లిపోకపోతే చంపుతామంటూ వాళ్లిద్దరూ బెదిరించారని నార్సింగి పోలీసులకు రాసిన ఫిర్యాదులో తెలిపింది. అంతేకాదు, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం తమ నాన్నకు ఫ్రెండ్‌ అనీ, తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మాయాంక్‌ తనను బెదిరించినట్లు లావణ్య ఆరోపించింది. మాల్వీ ట్రాప్‌లో పడి, రాజ్‌తరుణ్‌ తనను దూరం పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది. కానీ తాను రాజ్‌తరుణ్‌ లేకపోతే ఉండలేనంటోంది. తాను రాజ్‌తరుణ్‌తో కలసి ఉండాలని కోరుకుంటోంది.