Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jupalli Krishna Rao: ఉన్నతస్థితిలో ఉమామహేశ్వర క్షేత్రం

–దేశంలోనే చెప్పుకోదగ్గ విధంగా అభివృద్ది చేస్తాం
–నల్లమల పర్యాటక అభివృద్ది అధ్యయన పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupalli Krishna Rao:ప్రజా దీవెన, అచ్చంపేట: అత్యంత పురాతన మైన, ప్రసిద్దిగాంచిన ఆ ధ్యాత్మిక క్షేత్రo ఉమామహేశ్వర క్షే త్రమని, మహిమాన్వితమైన, పు రాతనమైన, శ్రీశైలం ఉత్తర ద్వారం గా ప్రసిద్దిగాంచిదని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) పేర్కొ న్నారు. ఉమామహేశ్వర క్షేత్రాన్ని దేశంలోనే చెప్పుకోదగ్గ విధంగా అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం నల్లమల్ల పర్యాటక అభివృద్ది అధ్యయన పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌ ఇంచార్జి మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి దామో దర రాజనర్సింహ్మా, అచ్చంపేట ఎమ్మేల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లాలోని ఇతర ఎమ్మేల్యేలతో కలిసి నాగర్‌కర్నూల్‌ జిల్లా, అచ్చం పేట మండలంలోని ఉమామ హేశ్వర దేవస్థానాన్ని దర్శించుకున్న అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) మాట్లాడుతూ రూ. 50లక్షల రూపాయలతో ఆల యం ముందు భాగాన్ని విస్తరించ డంతో పాటు భక్తుల సౌకర్యార్థమై ముఖ్య మైన అభివృద్ది పనులు చేపట్టబోతున్నామన్నారు. అంతకు ముందు మంత్రి దామోదర రాజన ర్సింహ్మా, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్ట ర్‌ చిక్కుడు వంశీకృష్ణతో పాటు ఇత ర ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రంగనాథ్‌లు పూలమొక్కలు ఇచ్చి స్వాగతం పలుకగా, ఆలయ అధి కారులు (temple members), అర్చకులు వేద మం త్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలుకగా సాంప్రదాయ దుస్తులతో ఉమమహేశ్వర సన్నిధిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకా లు నిర్వహించిన అనంతరం పండి తులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం రంగాపూర్‌ గ్రామంలోని నిరంజన్‌ షావలీ దర్గాలో చద్దరు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహ బూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు కసి రెడ్డి నారాయణ రెడ్డి, వాకిటి శ్రీహరి, డాక్టర్‌ రాజేష్‌ రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, మధుసూదన్‌ రెడ్డి, మేఘా రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్‌ రెడ్డి, పురావస్తు శాఖ డైరెక్టర్‌ భారతి హోళిఖేరి, పర్యాటక శాఖ డైరెక్టర్‌ ఇల త్రిపాఠి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ రఘునాథ్‌ గైక్వాడ్‌, జిల్లా అటవీ అధికారి రోహిత్‌ గోపిడి తదితరులు పాల్గొన్నారు.