Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandra Babu -Revanth Reddy: ముహూర్తం కుదిరింది..! ముందడుగు పడింది..!!

–ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రెండు కమిటీలకు అంగీకారం
–ఎవరి మనోభావాలూ దెబ్బతిన కుండా పరిష్కర మార్గం
–విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంల సమావేశంలో నిర్ణయం
–తొలుత సీఎస్ లతో అధికారుల కమిటీ 2 వారాల్లో భేటీ, ఇరు రా ష్ట్రాల మంత్రులతో మరో కమిటీ నియామకం
–ప్రజాభవన్ లో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రులు రేవంత్ రెడ్డి, చంద్ర బాబు నాయుడు, రెం డు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతా ధికారులు సమావేశం
–చిన్న చిన్న సమస్యలపై పేచీలు వద్దని, ముందు కనీసం రెండైనా చక్కదిద్దితే సానుకూలత వ్యక్తం
–సీఎంలు రేవంత్, చంద్రబాబు ఏకాభిప్రాయం

అనుకున్న విధంగానే ముహూర్తం కుదిరింది, అనుకున్న విధంగానే ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న ఆయా అంశాలకు సంబం ధించి ఉభయ రాష్ట్రాల ముఖ్య మంత్రుల భేటీకి సానుకూలంగా ముగిసింది. తొలి సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకొని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి (Revanth Reddy), చంద్రబాబు నాయు డు (Chandrababu Naidu)తమ విధానాలను వెల్లడించా రు. మొత్తానికి సమస్యల పరిష్కా రానికి సమానత్వం ముందుకు సాగాలని అందుకు అధికారుల కమిటీలో తేలకపోతే మంత్రుల కమిటీ దృష్టికి అక్కడ పరిష్క రించిన సమస్యలకు సీఎంల ఆమోదంతో పాటు డ్రగ్స్(drugs) నిరోధానికి అదనపు డీజీలతో కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటుకు సీఎంలు రేవంత్, చంద్రబాబు సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారని డిప్యూ టీ సీఎం భట్టి, ఏపీ మంత్రి సత్యప్ర సాద్ మీడియాకు వెల్లడించారు.

Chandra Babu -Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: పదేళ్ల పాటు పడకేసిన అపరిస్కృత సమ స్యలు ఒకేసారి సమస్యలన్నీ తీరి పోతాయని అనుకోవద్దని, ఒక్కోదా నిని నెమ్మదిగా పరి ష్కరించుకుం టూ వెళ్లాల్సిన అవసరం ఉందని, ఇక సమస్యలు తీరవు అన్న వాతా వరణం ఉండొద్దని, సకాలంలో పరి ష్కారం కాక ఇప్పటికే తెలుగు రా ష్ట్రాలు చాలా నష్టపోయాయని, ఇకమీదటనైనా సాగదీయొద్దoటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభ జన సమస్యల పరిష్కారం దిశగా రెండు రాష్ట్రాలు ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు వేశాయనే చెప్పాలి. ఈ సమస్యల పరిష్కా రానికిగాను రెండు రాష్ట్రాలు కలిసి రెండు కమిటీలను నియమించా టని ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రు ల సమావేశం (meeting)నిర్ణ యించింది. రెండు రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ, అదికారులతో మరో కమి టీని వేయనున్నారు.

ముందుగా చీఫ్ సెక్రటరీలతో(chief secretary) ఉన్నతస్థాయి ఆవిరా రుల కమిటీని నియ మిస్తా రు. ఇందులో ఒక్కో రాష్ట్రం నుంచి చీఫ్ వెక్రటరీతో కలిపి ముగ్గురేసి అధికారులు ఉంటారు. తమ స్థాయిలో పరిష్కారమయ్యే సమ స్యలపై ఈ కమిటీ దృష్టి సారిస్తుం ది. అప్పటికీ సమస్య లకు పరిష్కా రం లభించకపోతే ఐదు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీని నియ మించాలని డీఎంలు నిరంభిం చారు. ఈ మంత్రుల కమిటీ పరి ష్కరించిన సమస్యలకు ముఖ్య మంత్రుల స్థాయిలో ఆమోదం తెలపాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఆపరిష్కృతంగా ఉన్న ఏపీ పున ర్వ్యవస్థీకరణ చట్టం- 2014’లోని విభజన అంశాలపై శనివారం తెలం గాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇక్కడి ప్రజా భవన్ లో సమావేశమయ్యారు. సా యంత్రం 4 గంటలకు ప్రారంభమై న సమావేశం రాత్రి 1.45 గంటల వరకు గంటా 45 నిమిషాలపాటు కొనసాగింది.

ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో (revanth Reddy) పాటు డిప్యూటీ సీఎం ముల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమ లు, ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ముఖ్య మంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇతర సీని యర్అధికారులు పాల్గొన్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు తో పాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, పర్యాటక, సాంస్కృ తిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నా రు. ప్రజాభవన్‌కు ముందుగా రేవం త్‌రెడ్డి చేరుకోగా ఆ వెంటనే చంద్ర బాబు వచ్చారు.

చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి సాదర స్వాగతం పలి కారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కరించారు. తెలం గాణ ప్రముఖ కవి కాళోజీ నారాయ ణరావు రాసిన ‘నా గొడవ’ పుస్తకా న్ని చంద్రబాబుకు బహూకరించా రు. కాగా, రేవంత్‌, భట్టివిక్రమార్క లకు చంద్రబాబు వెంకటేశ్వరస్వా మి చిత్రపటాన్ని బహూకరించారు. సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

*సమన్వయంతో సమస్యలకు పరిష్కారం…* రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేను, ఏపీ మంత్రులు(ministers)అందరం కలిసి విభజన అంశాలపై లోతుగా చర్చించాం. విభజనకు సంబంధించిన చాలా సమస్యలు గత పదేళ్లుగా పరి ష్కారానికి నోచుకోలేదు. వీటన్నిం టిపై త్వరితగతిన చర్చించుకుని, ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. విభ జన చట్టంలో పొందుపరిచిన అం శాలతోపాటు పరిష్కారానికి నోచు కోని ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ సమస్యలన్నింటికీ సమాధానాలు, పరిష్కారాలు సమావేశంలోనే దొరుకుతాయని అనుకోలేదు. వీటి పరిష్కారానికిగా ను విధానపరమైన నిర్ణయం తీసు కోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సమావేశంలో కూలం కషం గా చర్చించుకుని ఒక నిర్ణ యానికి వచ్చామని భట్టివిక్రమార్క చెప్పా రు. ఈ మేరకు విభజన సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధి కారులతో కూడిన కమిటీని వేయా లని నిర్ణయించామన్నారు. చీఫ్‌ సెక్రటరీలతో సహా ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు అధికారులతో ఈ కమిటీని నియమిస్తామన్నారు.

రెం డు వారాల్లోగా ఈ కమిటీ సమా వేశమై, వారి స్థాయిలో పరిష్కార మయ్యే సమస్యలపై చర్చిస్తుంది. ఒకవేళ ఈ ఉన్నతాధికారుల కమిటీ స్థాయిలో కూడా పరిష్కారం కాని సమస్యలు ఏవైనా ఉంటే వాటి పరి ష్కారానికి రెండు రాష్ట్రాల మంత్రు లతో కూడిన మరో కమిటీని వేయా లని నిర్ణయించాం. ఈ మంత్రుల కమిటీ కూడా సమావేశాలు నిర్వ హించి, వారి స్థాయిలో సమస్య లను చర్చిస్తుంది. ఈ మంత్రుల కమిటీ చర్చించి పరిష్కరించే అం శాలను ముఖ్యమంత్రుల స్థాయిలో ఆమోదించడం జరుగుతుంది. అప్పటికీ పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రుల స్థాయిలో మళ్లీ సమావేశాలు నిర్వహించుకుని పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క (batti vikramarka) వివరించారు..

*అందరి మనోభావాలకు అను గుణంగానే పరిష్కారం: అనగాని* ..ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా విభజన అంశాల ను పరిష్కరించుకోవాలని నిర్ణయిం చినట్లు ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ (Satya Prasad) తెలిపారు. ‘‘ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమైన ఈ రోజు తెలుగు జాతి హర్షించే మంచి రోజని, ఇప్పటికే తెలంగాణను అభి వృద్ధి వైపు తీసుకెళ్లాలని ఇక్కడి సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సహచర మంత్రులు పని చేస్తున్నారని, అయి తే తెలుగువారు ఎక్కడున్నా సుభి క్షంగా ఉండాలని భావించి మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు రెండు రాష్ట్రాల మధ్య పెండిం గ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి సమావేశమవు దామంటూ రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

ఆ మేరకు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై కూలకంషంగా చర్చించి, మంత్రు లు, అధికారుల అభిప్రాయాలను తీసుకున్నాం. ఇదివరకు నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం సాగింది. ఆంధ్రప్రదేశ్‌ మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదని, అందరి భావోద్వేగాలను పరిగణన లో నేనుకి తీసుకుని, సమస్యలను సానుకూలంగా, సత్వరంగా పరిష్క రించుకోవాలని నిర్ణయించాం. అందులో భాగంగానే అధికారులు, మంత్రుల స్థాయి కమిటీలను ఏర్పా టు చేయడం జరిగింది. విభజన సమస్యలే కాకుండా రాబోయే రోజుల్లో మంచి వాతావరణాన్ని సృష్టించడానికి తరచుగా ముఖ్య మంత్రులు కలవాలని నిర్ణయిం చారు.

తెలంగాణ డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా ఉండాలన్న తపనతో పని చేస్తున్నారు. అక్కడ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్‌ నియంత్రణకు ఆరుగురు మంత్రు లతో సబ్‌ కమిటీ వేశాం. అక్కడ స్కూల్‌ బ్యాగుల్లో గంజాయి దొరు కుతున్న పరిస్థితులున్నాయి. అక్క డున్న డ్రగ్‌ కల్చర్‌కు, ఇక్కడి డ్రగ్స్‌ కల్చర్‌కు లింకు ఉంది. ఎందుకంటే అక్కడ గంజాయి ఉత్పత్తి అయి ఇక్కడి వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళనతో ఉన్నారు. అందుకే ఇరు రాష్ట్రాల అదనపు డీజీ స్థాయి అధికారులతో ఓ కమిటీని వేశాం. రెండు వారాల్లో, ఇరు ముఖ్యమం త్రులు హర్షించేవిధంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. తెలుగు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ హర్షించే విధంగా ఈ విభజన సమస్యల న్నింటీని పరిష్కరిస్తామని, సత్య ప్రసాద్‌ వివరించారు. కాగా, పలు అంశాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అన్నింటినీ చర్చించడా నికే కమిటీలు వేస్తున్నామంటూ భట్టివిక్రమార్క ఒకే వాక్యంలో సమాధానమిచ్చారు.

*డ్రగ్స్‌ నిరోధానికి కో–ఆర్డినేషన్‌ కమిటీ*
సమావేశంలో మరో అతి ముఖ్యమై న నిర్ణయం కూడా తీసుకున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. తెలం గాణను డ్రగ్స్‌ (drugs)రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మక నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. యాంటీ నార్కొ టిక్స్‌ బ్యూరోకు ఒక అడిషనల్‌ డీజీ స్థాయి అధికారిని నియమించి, ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగిస్తున్నాం. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి కార్యాచరణతో ముం దుకు వెళుతున్నాం. దాంతోపాటు సైబర్‌ క్రైమ్‌ నుంచి రాష్ట్రాన్ని కాపా డాలని ముందుకు వెళుతున్నాం.

వీటిపై రెండు రాష్ట్రాలు ఒక కో–ఆర్డినేసన్‌ కమిటీ ద్వారా పని చేస్తే నియంత్రించడానికి అవకాశ ముంటుందని భావించాం. వివిధ సరిహద్దుల నుంచి రకరకాల డ్రగ్స్‌ వస్తున్నాయి. అందుకే వీటి నియంత్రణ కోసం ఇరు రాష్ట్రాల అడిషనల్‌ డీజీ స్థాయి అధికారు లతో ఒక కో–ఆర్డినేషన్‌ కమిటీని వేయాలని నిర్ణయించాం. ఈ మహ మ్మారి నుంచి రెండు రాష్ట్రాలను కాపాడాలని విధానపరమై నిర్ణయం తీసుకున్నామని భట్టి వివరించారు.