Former Sarpanch Died: ప్రజా దీవెన, కోదాడ: కోదాడ మున్సిపల్ (Kodada Municipal) పరిధిలోని తమ్మర బండ పాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సామినేని వెంకటేశ్వర్లు (Samineni Venkateshwarlu) ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తమ్మర బండ పాలెం గ్రామపంచాయతీ గా ఏర్పడిన తరువాత రెండవ సర్పంచిగా ఎక్కువ కాలం సర్పంచిగా పదవి బాధ్యతలు స్వీకరించి తమ్మర బండ పాలెం అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప నాయకుడు తన జీవితం మొత్తం రాజకీయ ప్రస్తానములోని మూడుసార్లు తమ్మర గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ చైర్మన్ గాను, 20 సంవత్సరాలు గ్రామపంచాయతీ సర్పంచ్ గా ప్రజలతో మమేకమై రాజకీయాల్లో (politics) కొనసాగారు.
గ్రామా ప్రజలకు ఆయన చేసిన సేవలు పేదవారిపట్ల చూపిన అభిమానం ధైర్య సాహసాలగాను గ్రామ ప్రజలు సర్దార్ సామినేని (Sardar Samineni) అనే పేరుతో పిలుచుకునే వాళ్ళు ప్రస్తుతం ఆయన పెద్ద కోడలు స్వామినేని ప్రమీల రమేష్ కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు కొనసాగిస్తున్నారు. అలాగే చిన్న కుమారుడు సామినేని నరేష్ తమ్మర మూడో వార్డు కౌన్సిలర్ గా (As a councillor)పదవి బాధ్యతలు కొనసాగిస్తున్నారు. కుటుంబం అంతా ప్రజాసేవకే అంకితమై ప్రజలకు సేవలందిస్తున్నారు. తమ్మర బండ పాలెం గ్రామంలో ఆయన నివాస గృహానికి వెళ్లిపార్థివ దేహాన్ని పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు బంధువులు తమ్మర గ్రామ ప్రజల సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు సానుభూతి సంతాపాన్ని ప్రకటించారు. ఆదివారం సాయంత్రం వేలాదిమంది మధ్యలో అశ్రు నయనాల తో సర్దార్ సామినేని (Sardar Samineni) ఇక సెలవు అంటు అంతిమయాత్రను వైకుంఠధామం వరకు కొనసాగింది కుమారులు అంత్యక్రియలను నిర్వహించారు.