–తాజాగా మాజీ డీసీపీ రాధాకిషన్ పై మరో కేసు నమోదు
–బాధితుల ఫిర్యాదులపై దర్యాప్తు మరింత వేగవంతం
–ట్యాపింగ్ బాధితులకు పోలీసుల నిర్దిష్టమైన భరోసా
Phone tapping:ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో నే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) దర్యాప్తు ముమ్మ రంగా కొనసాగుతోంది. నిందితులపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసేందుకు సిట్, స్థానిక పోలీసులు సర్వసన్నద్ధమవుతున్నారు. ఈక్రమంలో ఎస్ఐబీ మాజీ చీఫ్, మాజీ డీసీపీ రాధాకిష న్ రావు, ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలపై Former SIB chief, former DCP Radhakishan Rao, ASPs Bhujangarao, Thirupatanna)బాధితులు ఇచ్చిన ఆరోపణలపై సిట్ ప్రత్యేక దృష్టి సారి స్తోంది. పోలీసు అధికారాన్ని దుర్విని యోగం చేసిన నిందితులు ట్యాపింగ్ కేసులో నిందితులను జైలుకు తరలించడంతో వారి బాధి తులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు (Police complaint) చేశారు. కొంతమంది నేరుగా తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీలకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిం దే. మరికొందరు వారి పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ట్యాపింగ్ నింది తుల బాధితులు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మాజీ డీసీపీ రాధా కిషన్ రావు బాధితులే అధికంగా ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబు తున్నాయి. కాగా బాధితుల ఫిర్యా దులు స్వీకరించిన పోలీసులు ఆయా కేసులపై దర్యాప్తు వేగ వంతం చేయాలని ఆయా ఠాణాల ఎస్ హెచ్ ఓ లకు ఆదేశాలిచ్చారు.
రాధాకిషన్ రావుపై మరో కేసు
ప్రముఖ వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్ (Venumadhav)కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ తో (Radhakishan) పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసిన విషయం విదితమే. షేర్ల బదలాయింపు విష యంలో తుపాకులు, కర్రలతో బెది రిస్తూ షేర్లు బదలాయించే ఒప్పం దంపై వేణుమాధవ్ బలవంతంగా సంతకం చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. తనను వేధిం చిన విషయం మీడియా, కోర్టులు, ఇతరులకుచెబితే చావుతప్పదని రాధాకిషన్ రావు బెదిరించిన వైనం, గట్టు మల్లు, ఎస్సై బృందానికి రూ.10 లక్షలు ఇచ్చిన విషయా లపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. వేణుమాధవ్ కిడ్నాప్ (Venumadhav Kidnapping)చేయించి వాటాలు బదిలీ చేయిం చే వ్యవహారంలో మాజీ డీసీపీ రాధా కిషన్ తో పాటు మరికొం దరిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండ గా మాజీ మంత్రి దయాకర్ రావు, మాజీ డీసీపీ రాధా కిషన్ రావు, ఏసీబీ ఉమామహేశ్వరరావులపై సీఎం రేవంత్, డీజీపీలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి దుబాయ్ నుంచి అందిన ఆన్లైన్లో ఫిర్యాదుపై దర్యాప్తు వేగ వంతం చేశారు. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి సైతం విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవా లని ఆదేశించారు.
ఈక్రమంలో మాజీ మంత్రి దయాకర్ రావు (Venumadhav Kidnapping) తనను అక్రమంగా నిర్బంధించి తన సమీప బంధువు విజయ్ పేరిట బలవంతంగా ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించారని ఫిర్యాదుపై పోలీసు లు విచారణ సాగిస్తున్నారు. రెండు రోజులపాటు తనను ఆక్రమంగా నిర్బం ధించడమే కాకుండా రూ. 50 లక్షలు ఇవ్వాలంటూ తన కు టుంబ సభ్యులను బెదిరించారని ఆరోపణలపై ఆధారాలు సేకరిస్తు న్నారు. బాధితుడు తన స్నేహితు డు రూ.50 లక్షలు వీరికి అందజే సిన తరువాతే తనను వదిలిపెట్టా రన్న విషయాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు.టాస్క్ ఫోర్స్ (Task Force) కార్యాలయంలో మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి, ఆపై కరోనా అంటించి చంపుతానని సుదర్శన్ అనే వ్యాపారిని బెదిరించి దాదాపు రూ. కోట విలువ చేసే ఇంటిని రాధాకి షన్ రావు కాజేసిన కేసుపై పోలీసు లు దర్యాప్త చేపడుతున్నారు. బాధి తుడు సుదర్శన్ కూకట్ పల్లి పోలీ సులకు ఫిర్యాదు చేయగా ఆ కేసు ను తాజాగా సనత్ నగర్ బదిలీ చేసిన విషయం విదితమే. ఈ కేసు లో మాజీ డీసీపీ, అప్పటి సీఐ గట్టు మల్లు తనను బెదిరించిన అంశా లపై సనత్నగర్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
కూకట్పల్లికి చెందిన సుదర్శన్, ఏవీకె రాజు, మరోవ్యక్తి రాజుల మధ్య భూ తగాదాకు సంబంధించిన లావాదేవీలపై వివాదం పై పూర్తి వివరాలు సేకరించారు. ఈ వివాదంలో ఒకరి తరపున రాధా కిషన్ రావు బాధితుడు సుదర్శన్ బెదిరించడంతో పాటు టైర్ తో చిత కబాదిన వైనంపై విచారణ చేపడుతున్నారు. ఈ కేసులోమాజీ డీసీపీ రాధాకిషన్తో (Radhakishan) పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన విషయం విది తమే. అయితే ఈ కేసులో నింది తులు ముందస్తు బెయిల్ పొందటంతో వారిని కస్టడీ కోరేందుకు పోలీసులు సమా యత్తమౌతున్నట్లు సమాచారం. అదే విధంగా ఎంఎల్ఎ కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నంద కుమార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహా రంపై డీజీపీ రవి గుప్తాను కలిసి ఫిర్యాదు చేసిన విషయం విదిత మే.
ఫోన్ ట్యాపింగ్ నిందితుల (Phone tapping) సహకారంతో ఫిలింనగర్లోని తన డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేశారన్న ఫిర్యాదుపై విచారణ వేగవంతం చేశారు. తన ఫోన్ ట్యాపింగు సంబంధించి అందించిన వివరాలపై సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో బాధితుడు డీజీపీకి అందించిన వివరాలపై పై విచారణ (investigation) చేపడుతున్నారు. అలాగే బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ తనతో పాటు పలువురు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే తుపాకీ కేసు, డ్రగ్స్.
గంజాయి కేసులు (Cases of marijuana)పెడతా మని బెదిరించారని బాధితుడు పేర్కొనడంతో ఆయా అంశాలపై విచారణ చేపడుతున్నారు. వెరసి ఫోన్ ట్యాపింగ్ నిందితులపై బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేశారని, ఆయా కేసులపై విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని పోలీసు బాసులు ఆదేశాలిచ్చారు. ట్యాపింగ్ (tapping) నిందితులపై వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల విషయంలో అలసత్వం వహించే పోలీసులపై శాఖాపరమైన చర్యలు తప్పవని పోలీసులు బాసులు తేల్చిచెబుతున్నారు. ఇదిలావుం డగా ట్యాపింగ్ కేసులో నిందితుల పై నమోదైన కేసులలో మిగిలిన నిందితులకు ముందస్తు బెయిల్ తీసుకోవడంతో కొందరుపోలీసులు సహకరించారన్నా ఆరోపణలపైనా సిట్ అధికారులు విచారణ చేపడు తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొం టున్నాయి.