Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NEET Exam: నీట్ పరీక్ష పవిత్రత నిస్సందేహంగా దెబ్బతింది

–నష్టo ఏ స్థాయిలో జరిగిందో ముందు గుర్తించాలి
–ఆ తర్వాతే మళ్లీ పరీక్షపై నిర్ణ యానికి అవకాశం
–సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున అందరికీ చేరితే పరీక్ష తిరిగి నిర్వహించాల్సిందే
–అందరికీ మళ్లీ పరీక్ష అంటే ఊ హించని తీవ్ర నిర్ణయమే
–నీట్‌పై సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు, కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీ ఏపై ప్రశ్నల వర్షం
–పూర్తిస్థాయి దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని సీబీఐకి ఆదేశం

NEET Exam: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీక్‌ (NEET Paper Leak) అయ్యిందనేది స్పష్టమైందని, అయితే ఏ స్థాయిలో జరిగిందో, ఆ ప్రశ్నపత్రం ఎంతమందికి చేరిందో గుర్తించాల్సిన అవసరం ఉన్నదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. ఆ అంశాలను బట్టే పరీక్షను మళ్లీ నిర్వహించాలా వద్దా అనేది నిర్ణయించాల్సి ఉం టుందని స్పష్టం చేసింది. నీట్‌, యూజీ పరీక్షను (NEET and UG Exam) రద్దు చేసి మళ్లీ నిర్వహించడం ఆఖరు ప్రత్యా మ్నాయం మాత్రమేనని తేల్చి చెప్పింది. ప్రశ్నపత్రం సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున లీక్‌ అయినా రీ టెస్టుకు ఆదేశించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి న నీట్‌ నిర్వహణలో అవకతవ కలు, పేపర్‌ లీకేజీకి, పరీక్ష రద్దుకు సంబంధించి దాఖలైన పలు వ్యా జ్యాలపై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్ర చూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఒక్కటి మాత్రం సుస్పష్టం. లీకేజీ జరిగింది. ఈ పరీక్ష పవిత్రత దెబ్బతిందన్న విషయంలో ఎలాంటి సందేహానికీ తావు లేదు.

అయితే.. లీక్‌ (leak)ఏ స్థాయిలో జరిగిందన్నదే ప్రశ్న’’ అని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. తప్పు చేసినవారిని పట్టుకోవాలంటే.. ముందు ఎక్కడెక్కడ లోపాలున్నాయో, తప్పులు జరిగాయో గుర్తించాలని పేర్కొంది. అలాంటివారిని గుర్తించగలిగితే.. వారికి మళ్లీ పరీక్ష పెట్టడం తప్పనిసరి కావొచ్చని అభిప్రాయపడింది. అంతే తప్ప అందరు అభ్యర్థులకూ మళ్లీ పరీక్ష పెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని, తీవ్రమైన నిర్ణయం అవుతుందని స్పష్టం చేసింది. ‘‘మళ్లీ పరీక్ష పెట్టాలనే నిర్ణయం తీసుకోవడానికి ముందు.. లీక్‌ ఎలా జరిగిందో మనం తెలుసుకోవాలి.

ఇంకోసారి పరీక్షకు హాజరు కావాలని 23 లక్షల మందిని అడగడం చాలా కష్టం’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్ర సర్కారుపైన, జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (National Testing Agency)(ఎన్‌టీఏ)పైన ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘పేపర్‌ లీక్‌ ఎలా జరిగింది, మొదట ఎక్కడ జరిగింది, ప్రశ్నపత్రాలను నిందితులకు చేరవేసిన విధానం ఏమిటి, పేపర్‌ లీకేజీకి, పరీక్షకు మధ్య ఎంత సమయం ఉంది, పరీక్ష మొత్తాన్ని ప్రభావితం చేసే స్థాయిలో జరిగిం దా, పేపర్‌ లీకేజీ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులను పూర్తి స్థాయిలో గుర్తించడం సాధ్యమేనా, పేపర్‌ లీకేజీ వ్యవహారంలో నింది తులను గుర్తించేందుకు తీసు కున్న చర్యలేంటి అంటూ కేంద్ర ప్రభు త్వంపైన, ఎన్‌టీఏపైన సీజేఐ (CJI on NTA) ప్రశ్నల వర్షం కురిపించారు.

‘‘పేపర్‌ లీక్‌ అయినప్పటి నుంచి పరీక్ష జరిగేటప్పటికి తక్కువ సమయమే ఉందని తేలితే.. నీట్‌ను రద్దు చేసి మళ్లీ పరీక్ష పెట్టాలనే నిర్ణయానికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది’’ అని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ‘‘లీకేజీ ఒకవేళ సామాజిక మాధ్యమాల ద్వారా జరిగి ఉంటే పేపర్‌ విస్తృతంగా వ్యాపించే అవకాశం ఉంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా.. కేంద్రానికి, ఎన్‌టీఏకి కొన్ని ప్రశ్నలు సంధించి, వాటికి సమాధానాలు ఇవ్వాలని కోరుతూ తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేశారు. అలాగే, నీట్‌ అక్రమాలపై దర్యాప్తు ఏ దశలో ఉందో తెలుపుతూ బుధవారానిక ల్లా నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించారు. ఈ సందర్భంగా.. నీట్‌ పరీక్షకు సంబంధించి నిగ్గు తేల్చాల్సిన అంశాలు కొన్నింటిని ధర్మాసనం గుర్తించింది.

ఆమెరకు ఈ ఏడాది 720కి 720 మార్కులు వచ్చిన విద్యార్థులు మునుపెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో గ్రేస్‌ మార్కుల వల్ల ప్రయో జనం పొందినవారు ఎంతమంది, ఒక సెంటర్‌లో పరీక్ష రాయడానికి రిజిస్టర్‌ (regsiter) చేసుకుని.. ఆ తర్వాత పరీక్షా కేంద్రాన్ని దూరంగా ఉన్న మరోచోటుకు మార్చుకుని, ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు ఎందరు, నీట్‌లో అసాధారణంగా ఎక్కువ మార్కులు పొంది పన్నెండో తరగతిలో మాత్రం ఆ స్థాయిలో సామర్థ్యాన్ని చూపని విద్యార్థులు ఎవరు, ఒక సబ్జెక్టులో అసాధారణం గా ఎక్కువ మార్కులు పొంది, మరో సబ్జెక్టులో అతి తక్కువ మార్కులు పొందిన విద్యార్థులెవరు, అనే అంశాలపై దృష్టి సారించాలని పేర్కొంది. అయితే, ఒక్కచోట (పట్నాలో) మినహా పేపర్‌ మరె క్కడా లీక్‌ కాలేదని సొలిసిటర్‌ జనరల్‌ పేర్కొన్నారు. ఆ ఒక్కచోట కూడా కేసు దర్యాప్తులో ఉందని కోర్టుకు విన్నవించారు.

ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం కోర్టు.. పేపర్‌ లీక్‌ విస్తృతంగా జరిగిందా, ఆ లీకేజీ.. పరీక్ష నిర్వహణ ప్రక్రియ విశ్వసనీయతనే దెబ్బతీసిందా, ఏ తప్పూ చేయని విద్యార్థులను, తప్పు చేసి లబ్ధి పొందిన విద్యా ర్థులను వేరు చేయడం సాధ్యమేనా అనే అంశాలను తాము పరిశీలిం చాల్సి ఉందని పేర్కొంది. పరీక్ష పవిత్రతనే దెబ్బతీసే స్థాయిలో లీక్‌ జరిగి.. తప్పు చేసిన విద్యార్థులను గుర్తించలేని పరిస్థితి ఉంటే మాత్రం మళ్లీ పరీక్ష నిర్వహించక తప్పదని అభిప్రాయపడింది. అదే సమ యంలో పేపర్‌ లీకేజీ (paper leakage) కొన్ని ప్రాంతా లకే పరిమితమై, తప్పు చేసినవా రిని గుర్తించగలిగితే 23 లక్షల మందికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించడం అనుచితమే అవు తుందని పేర్కొంది.

ఈ వివరాలు ఇవ్వండి..
పేపర్‌ ఎలా లీక్‌ అయ్యింది, అసలు మొట్టమొదటిగా పేపర్‌ ఎక్కడ లీక్‌ అయ్యింది
–ఏయే ప్రాంతాల్లో లీకేజీ జరిగింది,: ఎలా వ్యాప్తి చెందింది
–పేపర్‌ లీక్‌ అయిన సమయానికి పరీక్ష జరిగిన సమయానికి మధ్య ఎంత తేడా ఉంది
–లీక్‌ జరిగిన పరీక్షా కేంద్రాలు, నగ రాలను గుర్తించడానికి ఎన్‌టీఏ తీసుకున్న చర్యలేమిటి
–లీకేజీ వల్ల లబ్ధి పొందినవారిని ఎలా గుర్తిస్తున్నారు
–ఇప్పటివరకూ అలాంటి అభ్య ర్థులు ఎంతమందిని గుర్తించారు

అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వా లని ఆదేశించింది. అనుమానిత కేసులను గుర్తించేందుకు డేటా ఎనలిటిక్స్‌ను వాడే అవకాశం ఉందేమో పరిశీలించాలని కేంద్రానికి, ఎన్‌టీఏకి సూచించింది. అది సాధ్యమైతే తప్పుచేసినవారిని గుర్తించవచ్చని అభిప్రాయపడింది. అలాగే, నీట్‌ కౌన్సెలింగ్‌ పరిస్థితి ఏమిటో తెలపాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా నీట్‌ పరీక్ష పవిత్రతను కాపాడేందుకు.. సబ్జెక్ట్‌ నిపుణుల (Subject matter experts)తో కమిటీ ఏర్పాటు సహా పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.