–ఓయూలో అర్ధరాత్రి పెద్దఎత్తున అభ్యర్థుల ఆందోళన
–మూడు నెలల సమయo కావాలని డిమాండ్
–లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక
DSC: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం (State Govt) ఈనెల 18న నిర్వహిం చనున్న డీఎస్సీ పరీక్షను (DSC Exam) 3 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ (demand) చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు (DSC candidates) సోమ వారం అర్ధరాత్రి ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో (OU Arts College Campus) పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. అంతకుముందు సిటీ కళాశాల నుంచి ర్యాలీగా చేరుకున్న అభ్యర్థులు ఆర్ట్స్ కాలేజీ ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేస్తూ నిరస నను వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా డీఎస్సీ అభ్యర్థులు మాట్లా డుతూ టెట్ పరీక్షను నిర్వహించి నెల రోజులు కాకముందే డీఎస్సీ పరీక్షను నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సిలబస్ (Syllabus) ఎక్కువగా ఉండటం వల్ల డీఎస్సీ పరీక్షకు సిద్ధం కావడానికి కనీసం 90 రోజుల సమయం ఇవ్వా లని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభు త్వం డీఎస్సీ పరీక్షను (DSC Exam) వాయిదా వేయాలని కోరారు. ఇటీవలే వరుసగా గ్రూప్ 1 ప్రిలిమ్స్, డీఏఓ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తదితర పరీక్షలకు హాజరయి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న తాము, మరో పది రోజుల్లో డీఎస్సీ పరీక్ష (DSC Exam) ఉండటం వల్ల మరింత మానసిక ఒత్తిడికి గురికా వల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశా రు. ఇప్పటికైనా ప్రభుత్వం డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాల ని, లేదని మొండి వైఖరితో వ్యవ హరిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృ తం చేస్తామని వారు హెచ్చరించా రు. ఇదిలా ఉండగా టెట్ పరీక్షను నిర్వహించి నెల రోజులు కాకముం దే డీఎస్సీ పరీక్షను నిర్వహించడం దారుణం. డీఎస్సీ పరీక్షను (DSC Exam) వాయి దా వేయాలని ఆందోళన చేస్తున్న మాపై ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవరించి దురుసుగా ప్రవరిస్తు న్నది. డీఎస్సీ అభ్యర్థుల (DSC candidates) న్యాయబద్ధమైన డిమాండ్ను నెరవేర్చేదిశగా ప్రభుత్వం కృషి చేయాలి. అలాకా కుండా విద్యార్థుల పట్ల కక్షపూరితం గా వ్యవహరిస్తే భవిష్యత్లో విద్యార్థులంతా కలిసి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని డీఎస్సీ అభ్యర్థి కేశవ్ (DSC candidate Keshav) హెచ్చరిం చారు.