Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anna canteens: ఆంధ్ర ప్రదేశ్ లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ

–ఆగస్టు 15 తేదీలోపు ప్రారంభిం చాలని కీలక నిర్ణయం
–తొలిదశలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభానికి సంసిద్ధం
–ఇప్పటికే కసరత్తు ప్రారంభించి కార్యా చరణలో దిగిన ఏపీ సీఎం చంద్రబాబు

Anna canteens: ప్రజాదీవెన, అమరావతి: నిరుపేదలకు రెండు పూటల నాలుగు వేలు నోట్లోకి వెళ్లడం చాలా కష్టమవుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నాడు అన్న క్యాంటీన్ (Anna canteens) లను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లోని (andhra pradesh) ఆయా ప్రాంతాల్లో పని నిమిత్తం, ఆస్పత్రిలో చికిత్స కోసం బయట ప్రాంతాలకు వేలాది మంది వచ్చి వెళ్తుంటారు. అక్కడ సరైన భోజనం దొరకక, బయట హోటళ్లలో తినాలంటే డబ్బులు సరిపడక అలాంటి వారికి కడుపు నింపేందుకే అన్న క్యాంటీన్ల ((Anna canteens) లను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అయితే గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSR Congress Party) పాలనలో అన్న క్యాంటీన్ల ఊసెత్తకపోగా మూసేసింది. ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ ఏపీలో టీడీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చింది వచ్చీ రాగానే అన్న క్యాంటీన్ల గురించి ఆలోచించింది. ఆగస్టు 15వ తేదీ లోగా అన్న క్యాంటీన్లు తిరిగా ప్రా రంభిస్తామని సీఎం చంద్రబాబు (cm chandra babu) హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పంద్రాగస్టులోగా అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా తొలిదశలో 183 అన్న క్యాంటీన్లు (Anna canteens) ప్రారంభించాలని తెలుగు దేశం (టీడీపీ) ప్రభుత్వం నిర్ణయిం చింది. ఆ దిశగా వేగంగా అడుగు లు ముందుకు వేస్తోంది. ఇప్పటికే టెండర్లు పిలిచారు అధికారులు. ఈనెల 22 వరకు టెండర్లకు గడువు ఉండడంతో నెలాఖరు లోగా అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా (Food supply) చేసే సంస్థలకు సంబంధిం చిన టెండర్లను ఖరారు చేయనుం ది ఏపీ ప్రభుత్వం. మరోవైపు గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వహించిన అన్న క్యాంటీన్ల భవనాలకు మర మ్మతులు చేస్తున్నారు. అందుకోసం రూ. 20 కోట్లు వెచ్చించారు. ఐవోటీ డివైజ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ కోసం 7 కోట్ల రూపాయలు కేటాయించింది. మరో 20 అన్న క్యాంటీన్లకు (Anna canteens) కొత్త భవనాల నిర్మణం, పాత పెండింగ్‌ బిల్లుల(old pending bills) చెల్లింపుల కోసం రూ. 65 కోట్లు విడుదల చేయనుంది. దాత ల నుంచి విరాళాల సేకరణ అన్న క్యాంటీన్ల నిర్వహరణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాతల నుంచి విరా ళాలు సేకరించాలని భావిస్తోంది. ఇందు కోసం అన్న క్యాంటీన్ల పేరు తో ట్రస్ట్‌ ప్రారంభించి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ (web site)తయారుచేయబోతున్నా రు. దాతలు ఇచ్చే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపు ఉం టుందని అధికారులు చెప్తున్నారు. అన్న క్యాంటీన్ల పూర్తి భావం ప్రభు త్వంపై పడకుండా సరికొత్త ఆలో చన చేస్తున్నారు. దాతల సాయం తో అన్నా క్యాంటీన్లు నిర్వహించా లని డిసైడ్‌ అయ్యారు. విరాళాల సేకరణ కూడా మొదలుపెట్టారు. అంతేకాదు మరో కొత్త ఆలోచన చేశారు సీఎం చంద్రబాబు. పుట్టినరోజు జరుపుకునే వారు ఎవరైనా సరే అన్న క్యాంటిన్‌ ద్వా రా పేదలకు భోజనం అందిచొచ్చని చెప్పారు.

సర్వీస్ చార్జీలు (Service charges) మాత్రమే వసూలు… పేద ప్రజలకు రెండు పూటలా కడుపు నిండా భోజనం అందించాలన్నదే అన్న క్యాంటీన్ల లక్ష్యం. ఈ క్యాంటీన్లలో టిఫిన్‌, భోజనం ధరలు చాలా తక్కువ. గత టీడీపీ (tdp)హయాంలో కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం అంది చేవారు. అయితే ఇప్పుడు ఆ రేట్లు మారుస్తారా, ధరలు పెంచు తారా అన్న చర్చ ప్రజల్లో ఉంది. టీడీపీ ప్రభుత్వ మాత్రం గతంలో మాదిరిగానే తక్కువ ధరలకే పేద లకు భోజనం అందించాలని భావి స్తోంది. కేవలం 5 రూపాయలకే టిఫిన్‌, ఐదు రూపాయలకే భోజనం అందిస్తామని చెప్తోంది. అంటే 10 రూపాయలు పెడితే రెండు పూటలా కడుపు నింపుకోవచ్చు. ఇది నిజంగా రాష్ట్రంలోని పేద ప్రజలకు ( poor people) శుభవార్త అని చెప్పవచ్చు.