–భేషజాలు లేకుండా ఖజానా బరా బర్ నిండాల్సిందే
–ప్రతి ప్రభుత్వ శాఖ నెలవారీ లక్ష్యా నుగుణంగా పనిచేయాలి
–గత నెల జూన్ వరకు సహజ ఆ దాయం నిరాశజనకంగా ఉంది
–పన్నుదారులు ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేతలు లేకుండా చూడండి
–రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల రాబ డి పెరిగే చర్యలకు ఉపక్రమించండి
–ప్రభుత్వ శాఖల లక్ష్యాలపై ప్రతి శుక్రవారం డిప్యూటీ భట్టి సమీక్ష చేస్తారు
–ఆపై ప్రతి నెలా తొలి వారంలో పూ ర్తి స్ధాయిలో నేను సమీక్షిస్తా
–వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాం పులు, రిజిస్ట్రేషన్లు, మైనింగ్, రవా ణా విభాగాల అధికారులతో నిర్వ హించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చి పెట్టే శాఖలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాలతో నిర్దిష్ట రాబడులను నిర్దిష్టంగా రాబట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. వచ్చే రాబడులతోపాటు అదనంగా లక్ష్యాలను పెట్టుకొని ఖజానాను బరాబర్ నింపేందుకు ప్రతి విభాగం కృషి చేయాలన్నారు. గత ఏడా ది తో పోలిస్తే ప్రస్తుతం రాబడి పెరి గేం దుకు అవసరమైన చర్యలు చేప ట్టాలని స్పష్టం చేశారు. పన్ను ఎగవే తలు లేకుండా అన్ని విభాగాలు కఠి నంగా వ్యవహరించాలని చెప్పారు. పన్నుల వసూళ్లపై (collection of taxes)అధికారులు ని క్కచ్చిగా వ్యవహరించాలని ఆదే శించారు. వార్షిక లక్ష్య సాధనకు వీలుగా ప్రతి విభాగం నెలవారీ లక్ష్యాలను నిర్దే శించుకోవాలన్నారు.
సాధించిన పురోగతిని ఎప్పటిక ప్పుడు బేరీజు వేసుకోవాలని సూచించారు. సంబంధిత విభా గాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీక రించుకోవాలని, ఆదాయాన్ని (Income) రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేపట్టాలనిదిశానిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలో వాణి జ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మైనింగ్, రవాణా విభా గాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి ఈ మేర కు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో ఉప ముఖ్య మంత్రి భట్టి , రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో పాటు ఇతర అధికారులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ నిర్దేశిం చుకున్న వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదన్నారు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Oton Account Budget) లో పొందుపర్చిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే నెలవారీగా లక్ష్యాల ను నిర్దేశించుకుని, ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఆర్థిక మంత్రి (Finance Minister) భట్టి ప్రతి శుక్రవారం సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగ తిపై సమావేశమవుతారని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రధా నంగా రాష్ట్రానికి ఎక్కువ ఆదా యాన్ని తెచ్చి పెట్టే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాబడిని పెంచుకునే చర్యలు వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ సూచించారు. జీఎస్టీ ఆదా యాన్ని పెంచేందుకు వాణిజ్య పన్ను ల శాఖల అధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించాలని, పక్కాగా ఆడి టింగ్ చేయాలని ఆదేశించారు. జీఎస్టీ (gst) చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించకుండా పన్నులు వసూలు చేయాలని చెప్పారు. పెట్రోలు, డీజి ల్పై వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా విమా న ఇంధనంపై ఉన్న పన్నును సవరిం చే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఎన్నికలప్పుడు మ ద్యం విక్రయాలు ఎక్కువగా జరిగిన ప్పటికీ అంతమేర ఆదాయం పెరగక పోవడానికి కారణం ఏంటని సీఎం ప్రశ్నించారు.
అక్రమ మద్యం రవాణాకు (Trafficking of illegal liquor)అడ్డుకట్ట వేయాలని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరిక డితే ఆదాయం పెరిగే అవకాశం ఉందన్న చర్చ జరిగింది. డిస్టిలరీల నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా పెట్టాలని, అందుకు అవస రమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఉపయోగించాలని సీఎం ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అభి వృద్ధి కార్యక్రమాలతో హైదరా బాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపా రానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని సమావేశంలో చర్చ జరిగింది. ఈ ఆరు నెలల్లో ప్రభు త్వం చేపట్టిన కార్యక్రమాలతో వాణిజ్య నిర్మాణాలు పెరిగాయని, గృహ నిర్మాణాలు కూడా పుంజు కుంటాయని ముఖ్యమంత్రి అభిప్రా యపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల ధరలు భారీగా పెరిగాయని, అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూ చించారు. ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగా లంటే అక్రమ రవాణాను, లీకేజీ లను అరికట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేందుకు పరిమిత కా లం పన్ను సబ్సిడీ అమలైందని, తిరిగి పన్ను వసూలు చేయడం ద్వారా వాహనాల అమ్మకాలపై ప్రభావం పడిందా అన్న విషయమై అధ్యయనం చేయాలని సీఎం (cm) సూచించారు.