Train Travel: తాజాగా ఇండియన్ రైల్వే (Indian Railways) ప్రయాణికుల కోసం కొత్త విధివిధానాలను ప్రవేశ పెట్టింది. ఇప్పటి నుంచి నిత్యం తక్కువ ఖర్చుతో లక్షలాది ప్రయాణికులను (Passengers) గమ్యస్థానాలకు చేర్చే రైలు శాఖ టికెట్ బుకింగ్లో కొత్త రూల్స్ అమలు చేయబోతుంది. అలాగే రైలు ప్రయాణానికి ముందస్తుగా బుక్ చేసుకునే రిజర్వేషన్ టికెట్ల విషయంలో రైల్వే శాఖ కఠిన నియమాలు రాబోతున్నాయి. ఇక కొంత మంది తమ ప్రయాణానికి నెల నుంచి రెండు నెలల ముందుగానే టికెట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే అత్యవసర సమయాల్లో ప్రయాణం కోసం తత్కాల్ (tatkal) టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది.. కొన్ని సందర్భాల్లో టికెట్లు దొరకకపోతే.. కొంత మంది ప్రయాణికులు వెయిటింగ్ టికెట్తోనే స్లీపర్, ఏసీ క్లాస్లలో ప్రయాణిస్తుంటారు. దీంతో ఆయా క్లాస్లో ప్రయాణించే వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది. దీనికి పరిష్కారంగా పాటు భద్రత విషయంలోనూ రైల్వేశాఖకు ఒక పెద్ద సవాల్గా మారింది అనే చెప్పాలి.
వాస్తవానికి, ఒక క్లాస్ టికెట్ కొనుగోలు చేసి.. మరో క్లాస్లో ప్రయాణించడం (travel) కూడా నేరం కింద వస్తుందంట. తాజాగా ఈ విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వెయిటింగ్ టికెట్తో స్లీపర్, ఏసీ క్లాస్లో (sleeper ,ac)ప్రయాణించడం రద్దు చేసింది. అలా ఎవరైనా ప్రయాణిస్తూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని రైల్వేశాఖ తెలియచేసింది. ఇక పై కన్ఫర్మ్ టికెట్ లేకుండా ఏసీ, స్లీపర్ కోచ్లో ప్రయాణిస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వేశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రైల్వేశాఖ తాజాగా కఠిన నిబంధనలు జారీ చేసింది. ఇకపై వెయిటింగ్ టికెట్తో (tickets)స్లీపర్ కోచ్లో ప్రయాణం చేస్తై దొరికితే రూ.250 జరిమానా ఉంటుందని. ఏసీ కోచ్లో పట్టుబడితే రూ.440 వరకు జరిమానా (fine) విధించే అవకాశం ఉందని తెలిపారు రైల్వే శాఖ. దీనితో పాటు ఆ తర్వాత స్టేషన్ నుంచి అమలయ్యే ఛార్జీలను కూడా కలిపి కూడా వసూలు చేస్తారట. ఒక వేళా ఎవరైనా జరిమానా చెల్లించకుంటే రైల్వే యాక్ట్లోని సెక్షన్ 137 ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ తెలిపింది.
ఇక మరి కొందరు అయితే టికెట్లు కన్ఫర్మ్ (Tickets are confirmed) చేసుకోకుండానే స్లీపర్, ఏసీ కోచ్లలో ఎక్కి ప్రయాణికులను బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇండియన్ రైల్వే తీసుకున్న తాజా నిర్ణయంతో కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఊరట కలిగినట్లైంది. ఇక ఏసీ క్లాస్లో ఇలాంటి ఘటనలు తక్కువగా జరిగినీ.. స్లీపర్ క్లాస్లో మాత్రం నిత్యం ఈ తరహా దృశ్యాలు ఎల్లపుడు కనిపిస్తూనే ఉంటాయి. ఇకపై కన్ఫర్మ్ టికెట్లు లేకుండా స్లీపర్, ఏపీ బోగీల్లో ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవు తస్మాత్ జాగ్రత్త. అందుకే రైలు ఎక్కేముందు తమ టికెట్ కన్ఫర్మ్ అయ్యిందా లేదా అనే విషయం తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని రైల్వే అధికారులు తెలుపుతున్నారు.