–మెట్రో రైలు రెండో దోశ విస్తరణకు ముమ్మర కసరత్తు
–రెండో దశలో ఎల్బీనగర్ నుంచి హయత్నగర్, నాగోల్ నుంచి మై లార్దేవ్పల్లి, మియాపూర్ నుంచి పటాన్చెరు మార్గంలో మొత్తం 70 కి.మీ. ప్రతిపాదనలకు సిద్ధం
–మెట్రో రైలు రాకతో ప్రజలకు సుల భతరం కానున్న ప్రయాణం
Hyderabad Metro:ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైలు రెండో దోశ (Second error)విస్తరణను ఏర్పాట్లు వేగవంతం చేసేందుకు ముమ్మర చర్యలు చేప డుతున్నారు. రెండో దశలో ఎల్బీన గర్ నుంచి హయత్నగర్ (LBnagar to Hayatnagar), నాగోల్ నుంచి మైలార్దేవ్పల్లి, మియాపూర్ నుంచి పటాన్చెరు మార్గంలో మొత్తం 70 కి.మీ. మేర మెట్రో రైలు ప్రతిపాదనలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటిం చారు. అలాగే, మెట్రో అలైన్మెంట్ విషయంలో నిర్ణయాలు తీసుకున్నా రు. హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కలగనుంది. భాగ్యనగరంలో మెట్రో రైలు (Metro train) రెండో దశ విస్తరణలో భాగంగా ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మార్గం లో మొత్తం 6 స్టేషన్లు రాబో తున్నాయని మెట్రో అధికారులు వెల్లడిస్తున్నారు.
సగటున కిలో మీటరుకు అటుఇటుగా ఒక స్టేషన్ను ప్రతిపాదించారు. విజయవాడ జాతీయ రహదారి (Vijayawada National Highway)కావడం, కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం జరు గుతున్న నేపథ్యంలో మెట్రో స్టేషన్లు ఏర్పాటుచేసే ప్రాంతాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారికి రెండువైపుల నుంచి మెట్రో స్టేషన్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరు కోడానికి వీలుగా వాటి స్థానాలను సర్దుబాటు చేస్తున్నారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీతో కలిసి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు మెట్రోరైలు అధికా రులు తుదిరూపు ఇచ్చారు.రెండో దశ విస్తరణలో వేర్వేరు మార్గాల్లో 70 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఇందు కు సంబంధించిన డీపీఆర్ (DPR)పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందు లో
మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉన్న కారిడార్-1కు పొడిగిం పు అయిన ఎల్బీనగర్, హయత్నగర్ (LB Nagar, Hayat Nagar) మార్గం ఒకటి. ఈ మార్గంలో చిం తల్కుంట వద్ద ఒక స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఎల్బీనగర్ నుంచి చింతల్ కుంట వరకు మధ్యలోరు మెట్రోరై లు మార్గం ఉంటుంది. మిగ తా ఐదు స్టేషన్లు ఎక్కడెక్కడ అనేది త్వరలోనే స్పష్టత రానుంది. చింత ల్కుంట నుంచి హయత్నగర్ మధ్య నేషనల్ హైవేస్ (National Highway)అథారిటీ ఫ్లైఓవర్లు నిర్మాణం చేపట్టింది. దీం తో ఎడమవైపు సర్వీస్ రోడ్డులో మెట్రో మార్గం రానుందని హైదరబా ద్ మెట్రో సంస్థ అధికారులు పేర్కొ న్నారు. నగర శివారులోని హయత్ నగర్ నుంచి నిత్యం వేలాది మంది వేర్వేరు ప్రాంతాలు, ఐటీ కారిడార్కు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మార్గంలో వాహనాల రద్దీతో గంట ల తరబడి ట్రాఫిక్లోనే ఇరుక్కు పోతుంటారు. మెట్రో రైలు రాకతో వారి కష్టాలు తీరి ప్రయాణం సులభ తరం కానుంది. ఐటీ కారిడార్ వర కు అనుసంధానం ఏర్పడనుంది. కాగా బీహెచ్ఈఎల్ ప్రాంతంలోనూ పైవంతెన పక్క నుంచి మెట్రో రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. ఇదే మార్గంలో గంగారం వద్ద డబుల్ డెక్ ఫ్లైఓవర్ నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు.