–బిఆర్ఎస్ విలీనంపై ఆ పార్టీది విడ్డూరమైన వాదన
–గతంలో ఆ పార్టీ వాళ్లది ఇదే విధానం కదా
–శాసనసభ్యులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్నారు
–మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, మహబూబ్నగర్: బి ఆర్ఎస్ శాసనసభ్యుల్లో (BRS MLA) మూడింట రెండు వంతుల ఎమ్మె ల్యేలు చేరిక తర్వాత సీఎల్పీలో బీఆర్ఎస్ఎల్పీ విధిగా విస్పష్టంగా విలీనం అవు తుందని రోడ్లు భవనాలు సినిమా టోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి (congress) వచ్చే ఎమ్మెల్యేలంద రూ స్వచ్ఛందంగా ఆయా నియోజ కవర్గాల అభివృద్ధి కోసమే చేరు తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంక ట్రెడ్డి (Komati Reddy Venkata Reddy)తెలిపారు. గతంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని సీఎల్పీ విలీనమైందం టూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడా రని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు వారే తమను ప్రశ్నించడం విడ్డూ రంగా ఉందన్నారు. మహబూబ్న గర్ జిల్లా జడ్చర్లలో ఆయన మీడి యాతో మాట్లాడారు. తమ మూడు నెలల పని తీరుకు లోక్సభ ఎన్నిక లే రెఫరెండం అని చెప్పామని, అనుకున్న దాని కంటే సీట్లు తగ్గినా అసెంబ్లీతో పోల్చితే ఓటింగ్ శాతం పెరిగిందని గుర్తు చేశారు. గత పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వడం బీఆర్ఎస్కు చేతకాలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు కేసులను పరిష్కరించి 30 వేల మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారు. పకడ్బందీగా డీఎస్సీ నిర్వహణకు తాము కసరత్తు చేస్తుంటే దాన్ని రద్దు చేయాలంటూ కొందరు డిమాండ్ చేయడం శోచ నీయమన్నారు. నిరుద్యోగుల భవి ష్యత్ను ఆగం చేయవద్దని బీఆర్ ఎస్ నేతలను కోరారు. త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా మని, 65 పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏటా 10 వేల మందికి వివిధ రంగా ల్లో శిక్షణ ఇప్పిస్తామని వివరించా రు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబం ధించి సెప్టెంబరులో టెండర్లు పిలవ నున్నామని, ఈ నెల 22న ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగనుందని తెలిపారు.
కేటీఆర్కు మాట్లాడే అర్హతే లేదు
–రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
ప్రజా దీవెన, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని బీఆర్ ఎస్, బీజేపీ నేతలు (BRS and BJP leaders)మాట్లాడుతుం టే చూస్తూ ఊరుకోవాలా అని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. తాము బాధ్యతలు చేపట్టకముందే ఈ సర్కారు కూలిపోతుందంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యా నించారని గుర్తు చేశారు. కరీంనగర్ లో ఆయన విలేకరులతో మాట్లా డారు. ఫిరాయింపులకు కాంగ్రెస్ వ్యతిరేకమని, కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును కాపాడుకో వాల్సిన బాధ్య త తమపై ఉందన్నారు. ఫిరాయిం పులపై కేటీఆర్కు మాట్లాడే అర్హతే లేదని, బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మె ల్యేతో(mla) రాజీనామా చేయించకుండా మంత్రిని చేయలేదా అని ప్రశ్నించా రు.
చట్టంలోని నిబంధనల ప్రకారమే
–టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్
ప్రజా దీవెన, హైదరాబాద్: ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇతర పార్టీల ఎమ్మె ల్యేలను చేర్చుకుంటున్నామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్(Madhuyashki Goud) తెలిపారు. ఆత్మ రక్షణ కోసం ఏఐసీసీ అనుమతితోనే ఈ చేరికలు జరుగుతున్నట్లు తెలి పారు. గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సామా న్య రైతు కుంటుంబం నుంచి వచ్చి న రేవంత్రెడ్డి సీఎం కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నా రని దుయ్యబట్టారు. కాంగ్రెస్లో చేరే ఎమ్మెల్యేలకు ఎలాంటి పద వులు, హామీలు ఇవ్వట్లేదని, చట్టం లో ఉన్న వెసులుబాటు ప్రకారమే చేర్చుకుంటున్నామని తెలిపారు. దళిత నాయకుడు భట్టి అసెంబ్లీలో నిలదీస్తే కేసీఆర్ తట్టుకోలేకపో యారని, ఆ తర్వాతి సెషన్ వచ్చే సరికి 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లను బీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసుకున్నారన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ను (brs) బీజేపీలో విలీనం చేసేందుకు కేటీఆర్, హరీశ్రావు ఢిల్లీలో చర్చలు జరిపారని, కేసీఆర్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కవితను జైలు నుంచి విడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే, బీఆర్ఎస్ను విలీనం చేసుకునే అంశంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య భేధాభిప్రాయాలు ఏర్పడ్డాయ న్నారు. విలీనానికి కిషన్రెడ్డి ఓకే చెప్పారని, సంజయ్ (sanjay) మాత్రం హరీ శ్ను లాక్కుని బీఆర్ఎస్ను చీల్చా లని చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు కావాలనుకునే వాళ్లు పరీక్షల వాయిదాను కోరుకోరని, వాయిదే వేస్తే శిక్షణా సంస్థలు రూ.వంద కోట్ల మేర లబ్ధి పొందు తాయన్నారు. బీఆర్ఎస్ ఎంగిలి మెతుకులు తిన్న కొందరు బీసీల మని చెప్పుకుంటూ సచివాలయ ముట్టడి చేపట్టారని, వాళ్లు నిజమై న బీసీ ప్రతినిధులు కాదని అన్నా రు. టీపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే తీసకుంటానని, వేరే పదవి తీసు కోనని స్పష్టం చేశారు.