–2025 డిసెంబర్ నాటికి పాలమూ రు జిల్లాలో ప్రాజెక్టుల పూర్తికి శ్రీకా రం
–సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు నిరంతర ప్రక్రియ ప్రారంభం
–నీటిపారుదలకు కేటాయించిన రూ.28వేల బడ్జెట్ లో రూ. 18 వేల కోట్లు వడ్డీ చెల్లింపులకే పరిమితం
–వేతనాలు, బత్తాలకే రూ. 2 వేల కోట్లు అప్పనంగా చెల్లింపు వైనం
–ప్రాజెక్టుల నిర్మాణాలకు అదనంగా రూ. 11 వేల కోట్లకై ఆర్థిక శాఖకు విన్నపం
–తక్కువ ఖర్చుతో తక్కువ సమ యంలో అధిక ఆయకట్టు సేద్యం
–నెలాఖరు నాటికి నిర్మల్ జిల్లా సద ర్ మాట్ ప్రారంభం
–ఆగస్టు 15 వ తేదీ రాజీవ్ గాంధీ కెనాల్(సీతారామ ప్రాజెక్ట్)ప్రారంభం
–రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్ట్ ల నిర్మా ణాల పై సమీక్షకు అంకురం
— రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫ రాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనీ ప్రాజెక్టుల నిర్మా ణాల వేగవంతానికి నీటి పారుదల శాఖా రూట్ మ్యాప్ రూపొందించు కుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి యన్. ఉత్త మ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy)ఇటీవల మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు 2025 డిసెంబర్ నాటికి ఆ జిల్లాలో ప్రాజెక్టుల (projects) నిర్మాణాలు పూర్తి చేసేం దుకు ప్రణాళికలు రూపొందించు కున్నట్లు ఆయన వెల్లడించారు.పాలమూరు రంగారెడ్డి తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ ల పురోగతి తో పాటు నిర్మిం చాల్సిన ప్రాజెక్టుల పై బుధవారం ఆయన జలసౌదలో నీటిపారుదల అధికారులతో ఆయన సుదీర్ఘ సమీ క్ష నిర్వహించారు. నీటి పారుదల శాఖా కార్యదర్శి రాహుల్ బొజ్జ, అదనపు కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,నీటిపారుదల శాఖా సల హాదారు అదిత్యా దాస్, ఈయన్ సి అనిల్ కుమార్ సంబంధిత అధికా రులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
అనంతరం జరిగిన విలేకరుల సమా వేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)మాట్లాడుతూ కృష్ణా బేసిన్ పరి ధిలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజె క్ట్ తో పాటు మహబూబ్ నగర్ జిల్లా లోని కోయిల్ సాగర్,ఆర్ బి ఎల్ ఐ యస్,జే. ఎన్.ఎల్.ఐ .యస్,డిండి ఎల్ ఐ యస్,ఏ.యం.ఆర్ యస్ ఎల్ బి సి ,నెట్టెంపాడు, భీమా, కల్వ కుర్తి ఎల్ ఐ సి లతో పాటు గోదావరి బేసిన్ పరిధిలోని చిన్న కాళేశ్వరం, నిల్వాయి ప్రాజెక్ట్,పాలెం వాగు, మత్తడి వాగు,యస్.ఆర్ యస్.పి ఫెస్2,చనాకా కోరాట,లోయర్ పెన్ గంగా, దేవాదుల ,మోదీ కుంట వాగు,యస్.వై.పి, జే సి ఆర్ డి ఎల్ ఐ యస్, సీతారామ ఎల్ ఐ యస్ లపై సమగ్రమైన సమీక్ష నిర్వహిం చినట్లు ఆయన తెలిపారు.వీటిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్ట్ లతో పాటు గోదావరి బేసిన్ పరిధి లోని చిన్న కాళేశ్వరం, మోదీకుంట, లోయర్ పెన్ గంగా, చనాక కోరాట, శ్రీపాద ఎల్లంపల్లి,జే సి ఆర్ డి ఎల్ యస్ తదితరాలు పూర్తి చేసేందుకు 8,000 కోట్ల పై చిలుకు అవుతుంద న్న అంచనాకు అధికారులు వచ్చా రన్నారు.
అయితే అదే సమయంలో 2025 డిసెంబర్ మాసాంతానికి పూర్తి చేయాలన్న నిర్దేశిత లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించుకున్న తాము నీటి పారుదల శాఖకు అదనంగా మరో 11 వేల కోట్ల బడ్జె ట్ (budget) ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆర్థిక శాఖాకు పంపాలని నిర్ణయించామ న్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ (State Government Budget) లో 28,000 కోట్లు నీటి పారుదల శాఖాకు కేటాయించగా అందులో గత ప్రభుత్వం ప్రాజెక్ట్ ల నిర్మాణాల పేరుతో చేసిన అప్పులకు కడుతున్న వడ్డియే 18,000 కోట్లు అని మరో రెండు వేల కోట్లు జీత భత్యాలకే ఖర్చు అవుతున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అందుకే అదనపు బడ్జెట్ ను సమీకరిం చుకుని సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఆరు లక్షల పై చిలుకు ఎకరా లు సేద్యంలోకి తేవాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. అందులో భాగంగా ప్రాధాన్యత క్రమంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణా లను ఏ,బి,సి కేటగిరీలుగా విభ జించామన్నారు.ఇప్పటికే పూర్తి కావొచ్చిన వాటిని ఏ కేటగిరీలో, ఆ తరువాత బి,ఆ తరువాత సి లుగా విభజించడం జరిగిందన్నారు. ఏ కేటగిరీలో (category) 240.66 కోట్లతో 47,882 ఏకరాల ఆయకట్టును సేద్యం లోకి తీసుకొస్తన్నట్లు ఆయన ప్రకటిం చారు. అదే విదంగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులుగా నిర్మితమౌతున్న ప్రాజె క్టులకు సుమారు 7,500 కోట్ల పై చిలుకు అంచనా వ్యయంతో 5,84,770 ఎకరాల ఆయకట్టు భూమిని సేద్యం లోకి తీసుక రానున్నట్లు ఆయన చెప్పారు. అదే విదంగా నిర్మల్ జిల్లా సదర మాట్ ప్రాజెక్టు ను ఈ నేల చివరి నాటి కి,ఖమ్మం జిల్లాలో రాజీవ్ కెనాల్ (సీతారాం ప్రాజెక్ట్ )ను ఆగస్టు 15 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారం భించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)తెలిపారు.