Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

M. Hanumantha Rao: బోనాలకు విస్తృత ఏర్పాట్లు

–భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి
–వీఐపీల ప్రొటోకాల్‌పై జాగ్ర‌త్త‌గా ఉండాలి
— సికింద్ర‌బాద్ అమ్మ‌వారి టెంపుల్ ప‌రిశీల‌న‌లో దేవాదాయ శాఖ, ఐ అండ్ పీఆర్‌ క‌మిష‌న‌ర్ హ‌నుమంత‌రావు

M. Hanumantha Rao: ప్రజా దీవెన, హైద‌రాబాద్: బోనాలు (bonalu) సంద‌ర్భంగా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేయాల‌ని దేవాదాయ శాఖ, ఐ అండ్ పీఆర్‌ క‌మిష‌న‌ర్ హ‌నుమంత‌రావు (M. Hanumantha Rao) అన్నారు. గురువారం సికింద్ర‌బాద్ ఉజ్జ‌యినీ అమ్మ‌వారి టెంపుల్ ఏర్పాట్ల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ ర్బంగా బోనాల ఏర్పాట్ల‌పై అధికా రుల‌తో స‌మీక్ష నిర్వ‌హిం చారు. ఆషాఢ‌ మాసం సంద‌ర్భంగా బోనా ల ఉత్స‌వాలు (Festival of bonas)హైద‌రాబాద్‌ న‌గ‌ రంలో ఘ‌నంగా నిర్వ‌హిస్తు న్నామ‌ ని, ఆల‌యాల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌ని సూచించారు. అదే విధంగా వీఐ పీలు వ‌చ్చేట‌ప్పుడు ప్రోటోకాల్ పాటించాల‌న్నారు. ఈ స‌మీక్ష‌లో దేవాదాయ శాఖ అధి కారులు రీజిన‌ల్‌, జాయింట్ క‌మి ష‌న‌ర్‌, సికింద్రాబాద్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌, హైద‌రాబాద్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.