Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: అన్నదాతల ఆనందాలు సంబరాలే సంబరాలు

–కాంగ్రెస్‌ శ్రేణులు, రైతుల హర్షాతిరే కాలు
–రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు
–ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రప టానికి పాలాభిషేకం, పరస్పర మిఠాయిల పంపిణీ

CM Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్‌: రైతులకు రుణమాఫీ (Loan waiver for farmers) ప్రక్రియ ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్‌ శ్రేణులు, రైతులు హర్షాతిరేకాలు(Congress ranks and farmers are jubilant) వ్యక్తం చేశారు. పలుచోట్ల బాణ సంచా కాల్చుతూ, నృత్యాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ వేడుకలు చేసుకున్నారు. గ్రామగ్రా మాన పండగ వాతావరణం నెలకొం ది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ లో గురువారం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణు లు సంబరాలు జరుపుకొన్నాయి. కార్యకర్తలు, నాయకులు డప్పు చప్పుళ్ల మధ్య నృత్యం చేస్తూ బాణసంచా కాల్చుతూ సందడి చేశారు. స్వీట్లు పంపిణీ చేసి, పర స్పరం అభిందనలు చెప్పుకొన్నారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ( Revanth Reddy) చిత్రపటానికి పాలా భిషేకం చేశారు. రాష్ట్ర పార్టీ ఇన్‌ చార్జ్‌ దీపాదాస్‌ మున్షీతో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ కేక్‌ కోశారు.

రుణ మాఫీతో రైతులందరూ పండగ చేసుకుంటున్నారన్నారు. ఏక కాలంలో రుణమాఫీ (Loan waiver )చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి అన్నారు. సుమారు 70 లక్షల మంది రైతుల కు మేలు చేకూర్చేం దుకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.31 వేల కోట్లు నిధు లు వెచ్చించి రుణమాఫీ ప్రకటించి, సాహసోపేత మైన నిర్ణయం తీసు కున్నారని చె ప్పారు. రైతు డిక్ల రేషన్‌లో భాగంగా రాహుల్‌ ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తున్నా మన్నారు. హైదరా బాద్‌లోని పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రప టానికి క్షీరాభి షేకాలు చేశారు. రైతులను సన్మా నించి, స్వీట్లు పంచారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి ఆధ్వర్యం లో సంబరాలు జరిపారు. అశోక్‌న గర్‌లో ఏర్పాటు చేసిన సమావేశం లో తెలంగాణ జన సమితి నాయ కులు హర్షం వ్యక్తం చేశారు. ఓయూ లోనూ విద్యార్థి నేతలు సీఎం చిత్రప టానికి పాలాభిషేకం చేశారు.

వినూత్న తరహాలో… రుణమాఫీపై రాష్ట్ర పంచాయతీ రాజ్‌ చాంబర్‌ (Panchayat Raj Chamber)అధ్యక్షుడు, రైతు చింపుల సత్యనారాయణరెడ్డి వినూత్న రీతిలో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సచి వాలయ ఉద్యోగులకు క్యాబేజీ, సొరకాయలు ఉచితంగా అందిం చారు. రుణమాఫీ తనకు కూడా వర్తించిందని, ఆ పథకం అమలులో సచివాలయ ఉద్యోగులు కీలక భూమిక పోషించడంతో వారికి తన పొలంలో పండిన కూరగాయలను ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, అందుకే 2 వేల సొరకాయలు, 2 వేల క్యాబేజీలను అందించానని చెప్పారు.కరీంనగర్‌ సిటీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబ రాల్లో సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు, రైతులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. రామడుగులో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్‌లో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ సంబరాల్లో పాల్గొన్నారు. రుణమాఫీ కార్యక్ర మాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతువేదికల్లో రైతులు (farmers) చూసేందుకు ఏర్పాట్లు చేశారు.