Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nigeria Drugs: వెన్నూళ్ళుకొన్న నైజీరియా డ్రగ్స్

–అక్కడక్కడ కాకుండా సమస్త ప్రాంతాల్లో విస్తరిస్తున్న వైనం
–చేతులు మారే కొద్దీ పెరిగే కొకైన్‌ ధర, సముద్ర మార్గలో భారత్‌కు కొకైన్‌
–వెల్లడిస్తున్న పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్‌

Nigeria Drugs:ప్రజా దీవెన, హైదరాబాద్‌: నైజీ రియా డ్రగ్స్‌ (Nigeria Drugs) దందా ప్రధాన నగరా లకే కాకుండా చిన్న నగరాలకు కూడా విస్తరిం చిందని తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో (టీజీ న్యాబ్‌) పోలీసులు గుర్తించారు. ఇటీవల టీజీ న్యాబ్‌, సైబరాబాద్‌ పోలీసులు (TG NAB, Cyberabad Police) జరిపిన దాడుల్లో పట్టుబడ్డ నైజీ రియన్‌ గ్యాంగ్‌కు సంబంధించి కోర్టు కు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టు లో ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సా మ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం నైజీరియాలో ఉంటున్న ప్రధాన నిందితుడు డివైన్‌ ఎబుకా సుజీ సముద్ర మార్గం ద్వారా కొకైన్‌ను భారత్‌కు పంపుతున్నాడని పే ర్కొన్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరే కొకైన్‌ హైదరాబాద్‌, గోవా, బెంగళూరు నగరాలకు సరఫరా అవుతుందని వివరించారు. హైద రాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, ప్రకాశం జిల్లాలకు చేరుతుందని రిమాండ్‌ రిపోర్ట్‌లో సరఫరా చైన్‌ వివరాలను పూస గుచ్చినట్లు వెల్లడించారు. ‘‘హైద రాబాద్‌ నెట్‌వర్క్‌ను ఎజియోనిలి ఫ్రాంక్లిన్‌ ఉచెన్నా అలియాస్‌ కలేషీ నిర్వహిస్తున్నాడు.

బెంగళూరుకు చెందిన హెయిర్‌ స్టైలిస్ట్‌ యువతి ఒనుహ బ్లెస్సింగ్‌ అలియాస్‌ జోయానాగోమ్స్‌ (Joannagomes) ఈ సరఫరా చైన్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె ఢిల్లీ నుంచి కొకైన్‌ను రైలు, విమానాల్లో హైదరాబాద్‌కు తర లిస్తోంది. కలేషీ దాన్ని డ్రగ్స్‌ పెడ్లర్లు (Drug peddlers) ఆయిజ్‌ మహీమ్‌ అదెషోలా (నైజీరి యా దేశస్థుడు), బెంగళూరుకు చెందిన అల్లం సత్య వెంకట గౌత మ్‌, బోరబండకు చెందిన సన్న బోయిన వరుణ్‌కుమార్‌, బండ్లగూ డ జాగీర్‌కు చెందిన మహమ్మద్‌ మహబూబ్‌ షరీఫ్‌కు అందజేస్తు న్నాడని టీజీ న్యాబ్‌ పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు. గౌతమ్‌ ఏకంగా రాజమండ్రి, ప్రకాశం జిల్లాలకు డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను విస్తరిం చినట్లు తెలిపారు. గురు వారం అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, హోంశాఖ ముఖ్య కార్యదర్శులతో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో నిర్వహించిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా డ్రగ్స్‌పై సమాచార మార్పిడిపై పరస్పర సహకారం అందించు కోవాలని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో టీజీ న్యాబ్‌ (TG Nab)పోలీసులు రాజమండ్రి, ప్రకాశం జిల్లాల్లో డ్రగ్స్‌ దందాపై సమాచారాన్ని ఏపీ పోలీసులతో పంచుకోనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా నైజీరి యా గ్యాంగ్‌పై దాడి సందర్భంగా పోలీసులు 13 మంది డ్రగ్స్‌ విని యోగదారులను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. వీరిలో నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (Rakul Preet Singh) సోదరుడు అమన్‌ ప్రీత్‌సింగ్‌ కూడా ఉన్నారు. గౌతమ్‌, వరుణ్‌, షరీఫ్‌ ద్వారానే ఈ 13 మందికి కొకైన్‌ చేరినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 10 మంది డ్రగ్స్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలగా అమన్‌ ప్రీత్‌సింగ్‌, ప్రసాద్‌ అభయ్‌ మనా జ్కర్‌, నిఖిల్‌ ధావన్‌, చింతలపాటి మధుసూదన్‌కు నోటీసులు ఇచ్చా రు. నైజీరియన్‌ డ్రగ్స్‌ స్మగ్లర్ల నుంచి పెడ్లర్లు.. వినియోగదారుల వరకు కొకైన్‌ చేతులు మారిన కొద్దీ దాని ధర రెండింతలు, మూడింతలు నాలుగింతలు పెరుగుతూ ఉంటోం దని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో వివరించారు.