Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Janaki Isaiah:మానవ మనుగడకు మొక్కలు జీవనాధారం:జానకి యేసయ్యా

Janaki Isaiah:ప్రజా దీవెన,కోదాడ: ప్రతి ఒక్కరూ మొక్కలు (plants) నాటి వాడిని సంరక్షించినట్లయితే అవి పెరిగి పెద్దవై మానవ మనుగడకు ఎంతగానో ఉపయోగపడతాయని కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ మైనారిటీ (Christian minority)కోఆప్షన్ సభ్యురాలు ఒంటిపాక జానకి యేసయ్యా అన్నారు యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ United Pastors Association) నాయకుల ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని స్థానిక బాప్టిస్ట్ చర్చిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించా ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పాస్టర్స్ తో కలిసి మొక్కలు నాటారు అనంతరం నిర్వహించిన పాస్టర్ల సమావేశంలోఆమె పాల్గొని మాట్లాడారు ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి దానిని సంరక్షించినట్లయితే అవి పెరిగి పెద్దవై మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తాయని ఆమె గుర్తు చేశారు నాటిన మొక్కలు పెరిగి పెద్దవై పట్టణం అంతయు పచ్చదనం అందిస్తాయని తెలిపారు ప్రతి ఒక్కరూ మొక్కను నాటి సంరక్షించాలని తెలిపారు.

ఈ వర్షాకాలములో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.

కార్యక్రమంలో కోర్ కమిటీ చైర్మన్ ch లూకా కుమార్, నియోజకవర్గం అధ్యక్షులు రెవరెండ్ (Reverend Dr)డాక్టర్ వి యేసయ్య కోర్ కమిటీ సభ్యులు జి ఆర్ అబ్రహం శ్రీనివాస గౌడ్ (Srinivasa Goud)సుందర్ రావు నియోజకవర్గం సెక్రెటరీ రాజేష్, రూబెన్, కోదాడ పట్టణ అధ్యక్షలు ప్రభుదాస్,కోదాడ మండల అధ్యక్షలు శాంత వర్ధన్, అనంతగిరి మండల అధ్యక్షులు దానియేలు, నడిగూడెం మండలం అధ్యక్షులు ఏసురత్నం, చిలకూరు మండలం అధ్యక్షులు రాహుల్ మరియు క్రిస్టియన్ నాయకులు గుండెపంగు రమేష్, పంది తిరపయ్య గుడిబండ ఐసయ్య. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.