–భార్య, కూతురు హత్య ఆపై తానూ ఆత్మహత్య
–సికింద్రాబాద్ బోయిన్పల్లిలో హృ దయ విదారక దారుణ సంఘటన
Bowenpally Murder:ప్రజా దీవెన, హైదరాబాద్ : సికింద్రాబాద్ బోయిన్పల్లిలో (Secunderabad Boinpally)హృద యవిదారక దారుణ సంఘటన చోటుచేసుకుంది. అనుమానపు మొగుడు భార్య, 10 నెలల బిడ్డను దారుణంగా హత్య చేసి ఆపై అత డు కూడా ఆత్మహత్య చేసుకు న్నా డు. సమాచారం అందుకున్న పోలీసులు (police) ఘటనా స్థలానికి చేరు కుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాలను గాంధీ ఆస్ప త్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు భార్యపై అనుమానంతోనే హత్య (murder)చేసినట్లు భావిస్తున్నారు.
మహా రాష్ట్ర నాంథేడ్కు చెందిన గణేశ్, స్వప్న దంపతులు బోయిన్పల్లిలోని ఆర్యసమాజ్ వద్ద వీరు నివాసం ఉంటున్నారు. స్వప్న, గణేశ్ దంప తులకు ముగ్గురు పిల్లలు కాగా 10 నెలల వయస్సున్న నక్షత్ర అనే కూ తురు ఉంది. గణేశ్ ఆటో డ్రైవర్గా (auto driver)పని చేస్తున్నాడు. మూడవ కూతు రు నక్షత్ర తనకు పుట్టలేదని గణేశ్ కు అనుమానంతోనే తరచుగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగేది. అనుమానం పెనుభూతమై ఆది వారం తెల్లవారుజామున భార్య, కుమార్తెను గొంతు నులిమి చంపే సిన గణేశ్ అనంతరం అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. బేగంపేటలో రైల్వేట్రాక్పై విగతజీవిగా కనిపించాడు. తాను ఇప్పటికే భార్య, కుమార్తెను హత్య చేశానని, ఇప్పడు తాను ఆత్మహ త్య చేసుకుంటున్నానని పోలీసు లకు ఫోన్ (phone)చేసి చెప్పాడు.